వంగూరు, సెప్టెంబర్ 28 : సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మండలంలోని రంగాపూర్లో గురువారం కాంగ్రెస్, సీపీఎం పార్టీలకు చెందిన 60మంది కార్యకర్తలు విప్ గువ్వల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఉమ్మడి రా ష్ట్రంలో వెనుకబాటుకు గురైన తెలంగాణను నేడు అన్ని రంగాల్లో నెంబర్వన్ స్థానంలో నిలిపారని తెలిపారు.
సీఎంకు ప్రజలంతా మద్దతుగా ఉండాలని కోరారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో మహేశ్, రాజ్కుమార్, నరేశ్, రాకేశ్, రాములు, ఆంజనేయులు, గణేశ్, శివతోపాటు 60మంది కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, సింగిల్విండో చైర్మన్ సురేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ సంధ్య నర్సింహారెడ్డి తదితరులు పాల్గ్గొన్నారు.