దళితులపై వివక్షను అణిచివేద్దామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం మహబూబ్నగర్లోని తెలంగాణ చౌరస్తాలో బాబు జగ్జీవన్రామ్ విగ్రహానికి కలెక్టర్ వెంకట్రావుతో కలిసి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు.దళితబంధు కింద మంజూరైన 17 ట్రాక్టర్లు, 2 బొలెరోలు, గూడ్స్ వాహనాలను మంత్రి అందజేశారు. అనంతరం మంత్రి ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే దేవరకద్రలో మూసాపేట, అడ్డాకుల మండలాల్లోని సంకలమద్ది, తిమ్మాయపల్లికి చెందిన నలుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ట్రాక్టర్లను పంపిణీ చేశారు. జడ్చర్లలో డెయిరీ ఏర్పాటు కోసం రూ.50 లక్షల దళితబంధు చెక్కును ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అందజేశారు.
మహబూబ్నగర్, ఏప్రిల్ 5 : దళితులపై ఎవరైనా వివక్ష చూపితే అందరం కలిసి అణిచివేద్దామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. మంగళవారం బాబు జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఆయన విగ్రహానికి కలెక్టర్ వెంకట్రావుతో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు దళితులను కేవలం ఓటు బ్యాంక్గానే వాడుకున్నారని, కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక వారి సంక్షేమానికి సర్కార్ పెద్దపీట వేసిందన్నారు. ఎస్పీ, ఎస్టీలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. పాలమూరులో అంబేద్కర్ మహా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 2 వేల గజాల్లో అరుంధతి భవన్ను ఏర్పాటుకు రూ.20 లక్షలు మంజూరు చేశామన్నారు. అలాగే జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల వారికి శాంతనారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్టు ద్వారా ఉచితంగా కోచింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు ఆర్థిక సాయాన్ని, స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్స్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను మంత్రి అందజేశారు.
దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆకాంక్షించారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారులకు 17 ట్రాక్టర్లు, 2 బొలెరో, గూడ్స్ వాహనాలను మంత్రి అందజేశారు. అలాగే 49 స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రూ.కోటీ 4 లక్షల విలువైన బ్యాంక్ లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, అదనపు కలెక్టర్ తేజస్నందలాల్పవర్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, సాంఘిక, సంక్షేమ శాఖ జిల్లా అధికారి యాదయ్య, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదయ్య, కౌన్సిలర్ రవికిషన్రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, రైతుబంధు సమితి అధ్యక్షులు గోపాల్యదవ్, రవీందర్రెడ్డి, దళిత సంఘాల నేతలు శ్రీనివాస్మాదిగ, నర్సింహులు, నరసింహ, కృష్ణయ్య, సూర్యప్రకాశ్, బాలరాజు, బాలయ్య, టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు రాజీవ్రెడ్డి, చంద్రానాయక్, గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు రాజగోపాల్, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.