గద్వాల, ఫిబ్రవరి 17 : ప్రజలు శారీరక రుగ్మతల భారిన పడకుండా ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో గ్రామీణ ప్రజల ముంగిట యోగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మారుతున్న కాలనుగుణంగా ఆహార నియమాల్లో మార్పుల కారణంగా ప్రజలు అతి చిన్న వయస్సులోనే డయాబెటిస్, బీపీ, ఇతర అనారోగ్య సమస్య లకు గురవుతున్నారు. వీటి నుంచి బయట పడాలంటే ప్రస్తు తం పాత పద్ధతిలో యోగా, ఇతర ఆసనాలతో వీటి నుంచి విముక్తి పొందడానికి యోగా శిక్షణా కేంద్రాలను ఆయుష్ శాఖ ఏర్పాటు చేస్తున్నది. వ్యాధుల భారిన పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయుష్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో దవాఖానలకు వెళ్లకుండా వంటింటినే వైద్యశాలగా మార్చుకోవచ్చు. దినుసులతో తయారు చేసిన మిశ్రమాలు, పెరట్లో లభించే ఔషధ మొక్క లతో వ్యాధులను ఎలా నయం చేసుకోవాలో అన్న విషయా లపై యోగా శిక్షణా కేంద్రాల్లో ప్రజలకు అవగాహన కల్పించ నున్నారు.
గద్వాల జిల్లాలో 9 కేంద్రాలు
ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు 9 యోగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడానికి రూ.6 లక్షలు కేటాయిం చింది. మొత్తం రూ.54 లక్షలతో కేంద్రాలను ఏర్పాటు చేస్తు న్నారు. జిల్లాలో ఆయుర్వేదిక్ వైద్యశాలలు కొనసాగుతున్న గ్రామీణ ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యమిచ్చారు. జిల్లాలో గద్వాల, గట్టు, చింతరేవుల, ఎల్కూర్, మేడికొండ, మానవ పాడు, ఇటిక్యాల, రాజోళి, క్యాతూరు గ్రామాల్లో శిక్షణా కేం ద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పనులు చివరి దశకు చేరాయి. త్వరలో వాటిని ప్రారంభించడానికి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా యోగా విషిష్టత, కలిగే ప్రయోజనాలపై ప్రజ లకు అవగాహన కల్పించనున్నారు. నిబంధనల మేరకు నిర్మాణాలు చేపడుతున్నారు.
సౌకర్యాలు ఇలా..
ప్రజలు సీజన్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవా ల్సిన జాగ్రత్తలు ప్రజలు మానసికంగా, శారీరకంగా ఎలా ప్ర శాంతంగా చూసుకోవాలో యోగా సాధనతో శిక్షకుడు తెలియ జేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. శిక్షణా కేంద్రాల్లో షెడ్డు ఏర్పాటు చేసి వాటి చుట్టూ తులసీ, కలబంధ, పారి జాతం, రావి, మారేడు వంటి 15 రకాల మొక్కలు నాటను న్నారు. రక్షణ కోసం ఫెన్సింగ్తోపాటు క్యాటిల్ ట్రాక్ ఏర్పా టు చేయనున్నారు. నిత్యం యోగా సాధనతో ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉండనున్నది.