మూసాపేట (అడ్డాకుల), నవంబర్ 8 : కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని, కారు గుర్తుకు ఓటు వేసి అన్నివర్గాల వారికి మంచి చేస్తున్న సీఎం కేసీఆర్ను ముచ్చటగా మూడోసారి గెలిపించుకుందామని దేవరదక్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. బుధవారం అడ్డాకుల మండలంలోని కాటవరం, రాంచంద్రపూరం, వర్నె, ముత్యాలంపల్లి గ్రామాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీతతతఆర్కు మద్దతు తెలుపాలని కోరారు. ఎమ్మెల్యేకు గ్రామాల్లో ప్రజలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఓటు అడుగుతారని, వారు ఏ ఒక్కరినీ కూడా ఓటు అడిగే హక్కు లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే మళ్లీ కరెంటు కష్టాలు వస్తాయని, రైతుబంధు బంద్ అవుతుందన్నారు. పింఛన్ తగ్గిస్తారని, కల్యాణలక్ష్మిని ఖతం చేస్తారన్నారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించి అండగా నిలుస్తున్నారని చెప్పారు. కారుగుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి, ఎంపీపీ నాగార్జునరెడ్డి, వైస్ ఎంపీపీ రాధిక, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సింగిల్విండో ఛైర్మన్ జితేందర్రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు జయన్నగౌడ్, ఎంపీటీసీల సంఘం మండలాధ్యక్షుడు రంగన్నగౌడ్, మాజీ ఎంపీపీ ఎల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.