వనపర్తి, జనవరి 19 : కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పి న గురుకులాలు బడుగు, బలహీన వర్గాలకు వరంగా మారాయి. ఉన్నత విద్యను అందించేందుకు గత సర్కా రు కేజీ టూ పీజీ వరకు దశల వారీగా శ్రీకారం చు ట్టింది. ఆ దిశలోనే రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలను, కళాశాలలను గణనీయంగా పెంచుకుంటూ వచ్చారు. వందశాతం మెరుగైన విద్యతోపాటు పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో కూడా అందని స్థాయిలో విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఆ కోవలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గురుకుల పాఠశాలలు మెరుగైన విద్యకు చిరునామాగా మారాయి. పిల్లల భవిష్యత్కు బంగారు బాటలు చూపుతున్నాయన్న నమ్మకం ప్రజల్లో పెరిగింది. అందుకే స్కూళ్లకు డిమాండ్ పెరిగి సీట్లు దక్కించుకునేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు. ప్రతి ఏటా ఉత్తమ ఫలితాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతికిగానూ గురుకులాల ప్రవేశ పరీక్షకు వేళైంది. వి ద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభు త్వం జనవరి 6వ తేదీ నుంచి అవకాశం కల్పించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి గురుకులాలు కొనసాగుతున్నాయి. వాటిలో బాలురు, బాలికలకు కలిపి 105 పాఠశాలలు ఉన్నాయి. ఆయా చోట్ల చేరే విద్యార్థులకు వసతి కల్పించడంతో ఆంగ్లంలో బోధిస్తున్నారు. ఐదు జిల్లాల్లోని పా ఠశాలల్లో బాలబాలికలకు కలిపి 6వేలకుపైగా సీట్లు ఉన్నాయి. ఒక్కో గురుకులంలో ఒక్కో సెక్షన్ కింద 40 మంది విద్యార్థులకు, పాత గురుకుల పాఠశాలలో రెం డు సెక్షన్ల కింద 80 మంది చొప్పున కేటాయించారు. ఒక్కో పాఠశాలలో 5 నుంచి పదో తరగతి వరకు 480 చొప్పున విద్యార్థులు విద్యాభాస్యం చేస్తున్నారు. బీసీ-30 సాంఘిక సంక్షేమ శాఖ-35, గిరిజన సంక్షేమ-19, మైనార్టీ శాఖ-21 స్కూళ్ల చొప్పున మొత్తం 105 గురుకులాలు ఉన్నాయి. ఒక్కో గురుకులంలో 40 లేదా 80 సీట్లు ఉండగా.. విద్యార్థులు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు పొందనున్నారు.
గురుకులాల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో పా ఠ్యాంశాల బోధన జరుగుతున్నది. విద్యార్థుల భవిష్యత్కు ఉపయోగపడే అంశాలపై అవగాహన కల్పిస్తున్నా రు. మైనార్టీ గురుకులానికి మాత్రం ప్రత్యేక ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ గు రుకులాల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉంటుం ది. ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాల్లో 202 4-25 విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో ప్ర వేశాలకు నోటిఫికేషన్ జా రీ అయ్యింది. బాలబాలికలకు వేర్వేరుగా గురుకులాలు ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 20వ తేదీతో గడువు ముగియనున్నది. బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు అర్హులు.
పాస్పోర్టు సైజ్ ఫొటో, విద్యార్థి సంతకం.
విద్యార్థి చదువుతున్న పాఠశాల బోనఫైడ్.
విద్యార్థులు 2024 సెప్టెంబర్ ఒకటి నాటికి 9-11 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెండేండ్ల సడలింపు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1.50 లక్షలు కాగా, పట్టణ ప్రాంతాలకు చెందిన వారైతే రూ.2 లక్షలకు మించరాదు.
వివరాలను అప్లోడ్ చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలోనే పరీక్షా కేంద్రాలు.
ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఫిబ్రవరి 11న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తారు.
తెలుగు, ఇంగ్లిష్, గణితం, మెంటల్ ఎబిలిటీ, పరిసరాల విజ్ఞానంలో 3, 4వ తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి.
మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది.
తెలుగు-20, ఇంగ్లిష్-25, పరిసరాల విజ్ఞానం-20, మెంటల్ ఎబిలిటీ-10 మార్కుల ప్రశ్నలు ఉంటాయి.
ఓఎంఆర్ షీట్లో జవాబులు గుర్తించాలి.
తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పరీక్షా పత్రం.
http:///tewreis.ac.in
http:///tgegurkulam.telangana.gov.in
http:///mjptbewreis.telangana.gov.in
http:///tgcet.egg.gov.in
మైనార్టీ విద్యార్థుల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల మాదిరిగానే మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు చదివేందుకు ప్రత్యేకంగా మైనార్టీ సొసైటీ ద్వారా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నది. 5 నుంచి 8వ తరగతి వరకు ఖాళీలను భర్తీ చేయడమే గాక ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు. [ 5, 6, 7, 8వ తరగతులు, అలాగే కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం ఈనెల 18 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు అవకాశం [ 5, 6, 7, 8వ తరగతుల ప్రవేశ పరీక్ష, ధ్రువీకర ణ పత్రాల పరిశీలన ఏప్రిల్ 24 తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఉంటుంది. [ కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశ పరీక్ష మే ఒకటో తేదీ నుంచి 10 వరకు ఉంటుంది.