గద్వాల, ఫిబ్రవరి 13 : జిల్లాలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్భగీరథ పథకం సత్ఫలితాలను ఇస్తుంది. ఏండ్లుగా తాగునీటి ఎద్దడి తో అవస్థలు పడుతున్న గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన మిషన్భగీరథ పనులు జిల్లాలో పూర్తయ్యాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి నీటి సరఫరా చేస్తుండగా, మున్సిపా లిటీల్లోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా జరుగుతుంది. గతంలో మహిళలు తాగునీటి కోసం అవస్థలు పడి బోరుబావుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకొని తాగే వారు. నీటికోసం ఆడబిడ్డలు రోడ్డెక్కిన పరిస్థితులు ఉన్నాయి.
తెలంగాణ ఏర్ప డిన తర్వాత ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి మహిళల కష్టాలను తీర్చాలని భావిం చి ప్రభుత్వం మిషన్భగీరథ పథకం అమలు చేసింది. దీంతో మహిళలు నీటి కోసం బిందె పట్టుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు నీటికోసం నల్లాలు, బోరింగ్ల వద్ద ఘర్షణలు చోటుచేసుకోవడంతో రోడ్డెక్కి ధర్నాలు చేసిన సంఘట నలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీ ఆర్ చేపట్టిన మిషన్భగీరథతో మహిళల కష్టాలు తీర్చారు. రాష్ట్రంలో అమలవు తున్న మిషన్భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలవడంతో జలజీవన్ మిషన్ డైరెక్టర్ అజయ్కుమార్ ఈ పథకంపై ప్రశంశల జల్లు కురిపించడంతోపాటు ఇక్కడ ప్రజలకు అందుతున్న శుద్ధజలానికి దేశస్థాయిలో గుర్తింపు వచ్చింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం అమలులో లేదు.
జిల్లాలో 631ఓవర్హెడ్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. పాత ట్యాంకులు 297ఉండగా మిషన్భగీరథ నీరు ఇంటింటికీ అందించడంలో భాగంగా కొత్తగా 334 ట్యాంకులు నిర్మించారు. దీంతో జిల్లాలో మొత్తం 631ట్యాంకులు ఉన్నాయి. వీటికి జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్న మిషన్భగీరథ హెడ్వర్క్ నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. జూరాల హెడ్వర్క్ వద్ద శుద్ధిచేసిన నీటిని మొదట ధరూర్ మండలం మన్నాపురం సమీపంలోని కోరుకొండయ్య గుట్టపైకి తరలించి అక్కడి నుంచి పైప్లైన్ ద్వారా అన్ని గ్రామాలకు నీటిని అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లా మొత్తం 1388కిలోమీటర్ల మేర పైప్లైన్లు వేశారు. మిషన్భగీరథ పథకంలో ప్రధాన భాగమైన ఇంట్రా విలేజ్ ద్వారా జిల్లాలో 1,37,959ఇండ్లకు నల్లా కనెక్షన్ ఇచ్చి నీటి సరఫరా చేస్తున్నారు. ప్రతి ఇంటికీ ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేసి ఇంటి వద్ద నల్లా ఏర్పాటు చేశారు.
వీటితోపాటు 425ప్రభుత్వ పాఠశాలలకు, 600అంగన్వాడీ సెంటర్లకు, 79 రైతువేదికలకు, 164 వైకుంఠధామాలకు, 50 పబ్లిక్ హెల్త్సెంటర్లకు నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామాల్లో ఉండే ప్రజలకు 100లీటర్ల చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 135లీటర్ల చొప్పున రక్షిత మంచినీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ నీటిని క్రమం తప్పకుండా విడుదల చేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడడం లేదు. నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మిషన్భగీరథ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.