లింగాల, మే 11 : పిడుగుపాటుకు గురై రైతు మృతి చెందిన ఘటన లింగాల మండలం అంబట్పల్లిలో గురువారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. అంబట్పల్లికి చెందిన దాసరి కృష్ణయ్య (60) గ్రామ సమీపంలో పశువులను మేపేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములతోకూడిన అకాల వర్షం కురిసింది. వర్షం పడుతున్న సమయంలో కృష్ణయ్య పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లగా, పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య బాలపీరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలపీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
పిడుగుపడి కోడే మృతి
గద్వాల రూరల్, మే 11: మండలంలోని మదనపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి మదనపల్లి గ్రామానికి చెందిన కురుమ శేఖర్కు చెందిన కోడే పిడుగు పాటుకు గురై అక్కడిక్కడే మృతి చెందినట్లు పశువైద్యాధికారి శంకరయ్య తెలిపారు. మృతి చెందిన కోడే విలువ రూ 80 వేలు ఉంటుందని నిర్ధారించారు.
గుండూరులో కాడెద్దు..
కల్వకుర్తి రూరల్, మే 11 : పిడుగుపాటుతో కాడెద్దు మృతి చెందిన ఘటన కల్వకుర్తి మండలం గుండూరులో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. గుండూరుకు మంగళి శ్రీను కాడెద్దును వ్యవసాయ పొలం వద్ద కట్టేసి ఉంచగా, సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందింది. కాడెద్దు విలువ రూ.90వేలకుపైగా ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరారు.
రాచూర్లో ఆవు..
వెల్దండ, మే 11 : పిడుగుపాటుతో ఆవు మృతి చెందిన ఘటన వెల్దండ మండలం రాచూర్లో గురువారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. రాచూర్కు చెందిన మహిళారైతు అలివేలు రోజూ మాదిరిగానే వ్యవసాయ పొలంలో ఆవును కట్టేయగా, పిడుగుపాటుకు గురై మృతి చెందింది. ఆవు విలువ రూ.50వేలు ఉంటుందని, బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.