దేవరకద్ర, మార్చి 19 : తల్లి మృతి చెం దిన పుట్టెడు దుఃఖంతో ఓ విద్యార్థిని పరీక్షకు హాజరైన ఘటన దేవరకద్ర మండలకేంద్రం లో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం దేవరకద్రకు చెందిన న ట్టలి అంజమ్మ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందింది. అంజమ్మకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
రెండో కూతురు జ్యోతి పట్టణంలోని శ్రీవాణి శిశుమందిర్లో పదో తరగతి చదువుతూ ప్రస్తుతం పరీక్ష లు రాస్తున్నది. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష సెంటర్కు దుఃఖంతోనే పరీక్షకు హాజరైంది. ఉదయం అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండగా ఆ విద్యార్థినికి పదో తరగతి పరీక్ష ఉండడంతో.. ఎగ్జామ్ ముగిసిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.