జడ్చర్ల, ఫిబ్రవరి 2 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగా కొనసాగగా వేరుశనగకు అత్యధికంగా క్వింటా రూ.7,387ధర పలికింది. శుక్రవారం బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు వేరుశనగ, కందులు, ధాన్యం, మొక్కజొన్న, ఆముదాలు, మినుములు, బెబ్బర్లు, అమ్మకానికి వచ్చాయి. మార్కెట్కు 31క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ. 9,979, కనిష్ఠంగా రూ. 9,850, మధ్యస్తంగా రూ. 9,909 ధర పలికింది.
అదేవిధం గా 5,294 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.7,387, కనిష్ఠంగా రూ.4,009, మధ్యస్తంగా రూ.7,252 ధర పలికింది. అలాగే ఆముదాలకు క్వింటాకు గరిష్ఠంగా రూ.5,340, బెబ్బ ర్లు క్వింటాకు గరిష్ఠంగా రూ.7,001, మొక్కజొన్న క్వింటాకు గరిష్ఠంగా రూ. 2,372, మినుములు క్వింటాకు గరిష్ఠంగా రూ.7,001 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.