మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 27: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటివెలుగు’ను ఉ మ్మడిజిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది వినియోగించుకోవాలని జోగుళాం బ జోన్ 7 డీఐజీ ఎల్ఎ స్ చౌహాన్ సూచించారు. మహబూబ్నగర్ జిల్లా పోలీసు పరేడ్ కవాతు మైదానంలో పోలీ సు శాఖ తరఫు న సిబ్బందికి రెండురోజులు కం టివెలుగు శిబిరాన్ని డీఐజీ ముఖ్యఅతిథిగా హాజరై ఎస్పీ నర్సింహ, డీఎంహెచ్వో కృష్ణతో కలిసి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులు, సిబ్బందికి కంటి పరీక్షలు చేయించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములు, డీఎస్పీలు ఆదినారాయణ, వెంకటరమణారెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాసులు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటయ్య, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, రిజర్వ్ ఇన్సెక్టర్లు, పోలీసు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.