మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.276 కోట్లు మంజూరు చేసింది. దీంతో బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. పాలమూరు ప్రజలకు మంచి చేయాలనే తపనతో అడుగులు వేస్తున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషి ఎప్పటికీ ఇక్కడి ప్రజలు మరిచిపోరని, ఆయన్ను గుండెల్లో పెట్టుకుంటారని నేతలు అన్నారు.
మహబూబ్నగర్ అర్బన్, మే 24 : జిల్లా అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.276కోట్ల మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్కు జిల్లా బీఆర్ఎస్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, నాయకులు శ్రీకాంత్గౌడ్, శివారాజ్, వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, కేవీ కృష్ణమోహన్, శాంతన్నయాదవ్, గిరిధర్రెడ్డి, కౌన్సిలర్ నర్సింహులు, కిశోర్ తదితరులు పాల్గ్గొన్నారు.