ధరూర్, డిసెంబర్ 15 : జూరాల ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. 48 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే వస్తుండగా, 1,529 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. సాగునీటి ప్రాజెక్ట్లకు అవసరాల మేరకు యధావిధిగా నీటిని తరలిస్తున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్కు 390క్యూసెక్కులు, భీమాలిఫ్ట్-1కు 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి కాల్వకు 401 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 300 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ప్రాజెక్ట్ నీటిమట్టం 7.682 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.975 టీఎంసీల నీటిమట్టం ప్రాజెక్ట్లో నిల్వ ఉన్నది. ప్రాజె క్టు పూర్తి సామర్థ్యం 1045 అడుగుల గానూ ప్రస్తుతం 1041.732 అడుగుల నిల్వ ఉన్నది.
అయిజ, డిసెంబర్ 15 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో తగ్గింది. శుక్రవారం ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో నిల్ నమోదు కాగా, ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 358 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 7 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు ఆర్డీఎస్ ఏఈ రాందాస్ తెలిపారు. తుమ్మిళ్ల పథకం పంప్ ద్వారా నీటి విడుదల కొనసాగుతుందని పేర్కొన్నారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్ ఫ్లో స్వల్పంగా కొనసాగుతోంది. శుక్రవారం ఇన్ఫ్లో నమోదు కాగా, అవుట్ ఫ్లో 1,470 క్యూసెక్కులు ఉంది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్ర స్తుతం 11.774 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల గరిష్ఠ నీటిమట్టానికి గానూ, ప్రస్తుతం 1590.87 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.