అయిజ, డిసెంబర్ 14 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. గురువారం 198 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరగా, ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 396 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 7.5 అడుగుల మేరనీటి మట్టం ఉన్నట్లు ఏఈ రాందాస్ తెలిపారు. తుమ్మిళ్ల పథకం పంప్ ద్వారా నీటి విడుదల కొనసాగుతుందని పేర్కొన్నారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో స్వల్పంగా కొనసాగుతోంది. గురువారం 370 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, అవుట్ఫ్లో 976 క్యూసెక్కులుగా ఉన్నది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 11.885 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1,633 అడుగుల గరిష్ఠ నీటిమట్టానికి గానూ ప్రస్తుతం 1591.00 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.