బీడు భూముల్లో కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. ఇటీవల వరద జలాల రాకతో జూరాల, కోయిల్సాగర్, నెట్టెంపాడు, ఎంజీకేఎల్ఐ ఆయకట్టు రైతులకు ఈ సీజన్లో సేద్యానికి భరోసా కలిగింది. ఎత్తిపోతల నుంచి కాల్వల మీదుగా సాగునీరు కదిలొస్తున్నది. నిరంతరం నీటి విడుదల కొనసాగుతుండడంతో ఇక ఢోకా తీరింది. పెద్ద ఎత్తున సాగవుతున్న పంటలతో పొలాలు మురిసి పోతున్నాయి. భూములు పచ్చని మాగాణుల్లా దర్శనమిస్తున్నాయి. వానకాలం వచ్చినా వర్షాభావ పరిస్థితులే నెలకొనగా దాన్ని మరిపించిన ప్రాజెక్టులు పంట పొలాలకు కొత్త జీవాన్ని అందిస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసినా పచ్చదనంతో ఈ ప్రాంతాలు మరో కోనసీమను తలపిస్తున్నాయి. 20 ఏండ్లుగా ఇంత మంచి కాలాన్ని చూడలేదని రైతులు ఆనందంతో చెబుతున్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ చలువే అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ) /మరికల్/కేటీదొడ్డి, ఆగస్టు 22
కేటీదొడ్డి, ఆగస్టు 22 : ఉమ్మడి రాష్ట్రంలో పక్క నే కృష్ణమ్మ పారుతున్నా చుక్కనీరు రాక బీడుభూములతో రైతు ఎప్పుడు వరుణ దేవుడు కరుణిస్తాడా అని ఆకాశానికి వర్షం కోసం ఎదురుచూసేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేటీదొడ్డి మండలంలోని పాతపాలెం, గంగన్పల్లి, మైలగడ్డ, ఈర్లబండ, వెంకటాపురం, పా గుంట, ఇర్కిచేడు, కొండాపురం, గువ్వలదిన్నె, నందిన్నె గ్రామాల్లోని వరిపంటలు మరో కోనసీమను తలపిస్తున్నాయి. గతంలో ఇంతగా వరిపంట సాగుచేసిన దాఖలాలు లేవని ఆయా గ్రామాల రైతులు సంబురపడుతున్నారు. నియోజకవర్గ పంటల పరిస్థితులను గమనించిన గద్వా ల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి నెట్టంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా ర్యాలంపాడు డ్యాంకు నీటిని వదిలి కాల్వల ద్వారా పలు గ్రామాల చెరువులను నింపి రైతులకు వ్యవసాయంపై భరోసా క ల్పించారు. ఇప్పుడు వర్షాలు సరిగా లేకపోయి నా పంటలు పచ్చగా కళకళలాడుతున్నాయి.
ర్యాలంపాడు రిజర్వాయర్తో సస్యశ్యామలం..
ర్యాలంపాడు రిజర్వాయర్ రైతన్న పాలిట వ రంగా మారింది. నెట్టంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ రిజర్వాయర్కు కృష్ణమ్మను పరుగులు పెట్టించారు. ఇప్పటికే కాల్వల ద్వారా సాగునీరు వస్తున్నది. కొన్ని రోజుల్లోనే చెరువులు నిండి పం టలకు నీరు పుష్కలంగా అందుతుంది. బీడు భూ ములు సైతం సాగుకు యోగ్యంగా మారాయి. సా గును సంబురంగా మార్చిన సీఎం కేసీఆర్, ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
పెరిగిన భూగర్భజలాలు..
ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా చెరువులకు నీళ్లు రావడంతో భూగర్భజలా లు పెరిగాయి. బోర్లు రిచార్జీ అయ్యాయి. గతంలో ఒక్క పంటకే నీరందని పరిస్థితులు.. నేడు రెండు పంటలకు పుష్కలంగా నీరందుతుంది. దీంతో యాసంగి, వానకాలం వరి సాగు గణనీయంగా పెరిగింది. గతంలో 400 ఫీట్లు వేస్తే కూడా రానీ నీళ్లు ప్రస్తుతం 200 ఫీట్లలోపే వస్తున్నాయి.
24 గంటల కరెంట్తో రైతుల హర్షం..
వ్యవసాయం కోసం 24గంటల కరెంట్ రైతులకు ఎంతో మేలు చేస్తున్నది. రాత్రి సమయంలో పొలానికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. గతం లో కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుం దో తెలియక చాలా మంది విద్యుదాఘాతానికి, పాముకాట్లకు గురైన ఘటనలు అనేకం ఉన్నాయి. సీఎం కేసీఆర్ సాగును సంబురంగా మార్చడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్..
తెలంగాణ సాధించి తొమ్మిదేండ్లే గడిచినా 70ఏండ్ల ప్రగతిని సాధించాం. రైతు బిడ్డ అయిన సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు తెలుసు కాబట్టే ఎవరూ ఊహించని విధంగా సాగునీళ్లు తీసుకొచ్చి రైతుల కష్టాలు తీర్చిండు. పక్కనే కృష్ణమ్మ పారుతున్నా సాగునీటికి నోచుకోని దుర్భర జీవితాలను ఉమ్మడి రాష్ట్ర పాలకులు అందించారు. సీఎం కేసీఆర్ సాగునీరు, ఉచిత కరెంటు, రైతుబీమా, రైతుబంధుతో కర్షకులకు అండగా నిలిచారు.
– బండ్ల కృష్ణమోహన్రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే