నాగర్కర్నూల్, నవంబర్ 28 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్షోకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దాదాపు కిలో మీటరు పొడవునా కొనసాగిన ర్యాలీలో యువకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డితోపాటు ఎమ్మెల్యే సతీమణి మర్రి జమునారాణి, సీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, నాగం శశిధర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.