నారాయణపేట, నవంబర్ 28: జిల్లాలో పెండింగ్ కేసుల పరిష్కారానికి కోర్టు అధికారుల సమన్వయంతో కృషి చేస్తున్నామని డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి డీజీపీ మహేందర్రెడ్డి నిర్వహించిన వీసీలో డీఎస్పీ మాట్లాడారు. చోరీల నివారణకు పెట్రోలింగ్ వాహనాలతో తనిఖీలు నిర్వహిస్తున్నామని, పోలీసు అధికారులు, సిబ్బంది రోజువారీ కార్యక్రమాలు ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయన్నారు.
సిబ్బందికి శిక్షణ ద్వారా సాంకేతికతపై అవగాహన కల్పిస్తున్నామని, ప్రజలకు షీ టీమ్స్, కళాబృందాల ద్వారా పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో అక్టోబర్ నెలలో జిల్లాలో ఫంక్షనల్ వర్టికల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 22మంది పోలీస్ సిబ్బందికి అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో సీఐలు శ్రీకాంత్రెడ్డి, సీతయ్య, రామ్లాల్, ఎస్సై సురేశ్, సుధామాధురి తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 7 ఫిర్యాదులు
పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 07 ఫిర్యాదులు వచ్చాయి. డీఎస్పీ సత్యనారాయణ ఫిర్యాదులను స్వీకరించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. సివిల్ ఫిర్యాదులను కోర్టులో పరిష్కరించుకోవాలన్నారు.