మహబూబ్ నగర్ : జిల్లాలోని దేవరకద్ర పట్టణం బీఆర్ఎస్ ( BRS ) శ్రేణులు, కార్యకర్తలతో గులాబీమయమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar Reddy ) పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలోనే దేవరకద్ర అభివృద్ధి చెందిందని, అబద్ధపు హామీలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ని ఓడించాలని పిలుపునిచ్చారు.రెండేళ్లలో మున్సిపాలిటీలకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమిలేదని, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని పేర్కొన్నారు.