మహబూబ్నగర్, జూన్ 30 : గ్రూప్-4 పరీక్షను శనివారం పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పరీక్ష నిర్వహణకు జిల్లావ్యాప్తంగా 111 కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 34,459మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేం ద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పించారు. ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్, రూట్ అధికారులు, ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇచ్చారు. గ్రూప్-4 పరీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
ఆలస్యమైతే అనుమతి ఉండదు కలెక్టర్ రవినాయక్
అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ రవినాయక్ సూచించారు. పరీక్షా కేంద్రంలోకి ఉదయం 8గంటల నుంచి అనుమతించనున్నట్లు తెలిపారు. 9:45 గంటలకు పరీక్షా కేంద్రం గేట్లను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. మొదటి పేపర్ 10నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు, రెండో పేపర్ మధ్యా హ్నం 2:30నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుందన్నారు. మధ్యాహ్నం ఒం టిగంట నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, 2:15గంటలకు గేట్లు మూసివేయనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు 111మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 111మంది లైజన్ అధికారులను, 20మం ది రూట్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. గ్రూప్-4 పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల పరిశీలన
భూత్పూర్, జూన్ 30 : పట్టణంలోని న్యూఎరా హైస్కూల్, పాలమూరు ఐటీఐ కళాశాలల్లో ఏర్పాటు చేసిన గ్రూప్-4 పరీ క్షా కేంద్రాలను శుక్రవారం లైజన్ ఆఫీసర్ చెన్నకిష్టన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. న్యూ ఎరా హైస్కూల్లో 312మంది, పాలమూ రు ఐటీఐ కళాశాలలో 240మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఉదయం 8గంటల్లోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర, జూన్ 30 : గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు స్విట్స్ ఇంజినీరింగ్ కళాశాల, దేవరకద్ర జూనియర్ కళాశాల, బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, వెంకటసాయి కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చే సినట్లు తాసీల్దార్ జ్యోతి తెలిపారు. మొత్తం 1832మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
పకడ్బందీగా నిర్వహించాలి
మహబూబ్నగర్, జూన్ 30 : గ్రూప్-4 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డి అన్నా రు. హైదరాబాద్ నుంచి కలెక్టర్ రవినాయక్తో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షా కేంద్రానికి 100నుంచి 200 మీటర్ల వరకు ఎవరూ రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల్లో ఫొటోలు, వీడియోలు తీయకూడదని, ప్రతి కేంద్రం వద్ద ఐండేటిఫికేషన్ అధికారులను నియమించాలని తెలిపారు. మహిళలు, పురుష అ భ్యర్థుల తనిఖీ కోసం వేర్వేరుగా ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళల తనిఖీకి మ హిళా సిబ్బందిని నియమించాలని, అన్ని కేంద్రాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండేలా చూసుకోవాలన్నారు. అభ్యర్థు లు హాల్టికెట్తోపాటు, ఫొటో గుర్తింపుకార్డు తీసుకురావాలని సూచించారు. పరీ క్ష సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 144 సెక్షన్ విధించాలన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు కం ట్రోల్రూంలో అందుబాటులో ఉంటూ పరీక్షను పర్యవేక్షించాలని, అవసరమైతే అదనపు వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. వీసీలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్, అదనపు కార్యదర్శి సంతోష్ ఉన్నారు.