మహబూబ్నగర్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవం గురువారం అట్టహాసంగా జరిగింది. గవర్నర్ తమిళిసై హాజరై 73 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్, వివిధ అంశాల్లో పీహెచ్డీ చేసిన ఆరుగురికి పట్టాలను పంపిణీ చేశారు. యూనివర్శిటీ పచ్చదనం తనను ముగ్ధురాలిని చేసిందని పేర్కొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ వీసీ బీజేరాజు, పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్, ప్రొఫెసర్లు, అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. పాలమూరు యూనివర్సిటీని 2008లో ప్రారంభించగా.. 14 ఏండ్ల తర్వాత 3వ స్నాతకోత్సవం నిర్వహించారు.
ఉదయం నుంచే యూనివర్సిటీ ప్రాంగణంలో కోలాహలం నెలకొన్నది. విద్యార్థినీ విద్యార్థులు ఆడిటోరియం వద్ద సందడి చేశారు. యూనివర్సిటీ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వద్ద సెల్ఫీలు దిగుతూ కనిపించారు. కార్యక్రమానికి ప్రత్యేక్షంగా తిలకించడానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు గోల్డ్ మెడల్స్ను సాధించడంతో ఆనందభాష్పాలు రాల్చా రు.
హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ వీసీ బీజే రావు పాలమూరుకు చెందిన వ్యక్తి కాగా.. పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ నారాయణపేట జిల్లాకు చెందిన వా రు.. ఇద్దరూ కష్టపడి చదివి వీసీలుగా ఎదగడంతో వారు స్నాతకోత్సవానికి హాజరవడంతో హర్షధ్వానాలు మిన్నంటాయి. సమావేశానికి పీయూ రిజిస్ట్రార్ గిరిజా మంగతాయారు, అదనపు కలెక్టర్ సీతారామారా వు, అడిషనల్ ఎస్పీ రాములు, ఆర్డీవో అనిల్కుమార్, యూనివర్సిటీ హెచ్వోడీలు పాల్గొన్నారు.