మక్తల్ టౌన్, జనవరి 19 : విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వైద్యులను టెర్మినేట్ చేసినట్లు నారాయణ పేట కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మక్తల్ నియోజకవర్గం మాగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ రాజేశ్ (చేగుం ట), డాక్టర్ నాగరత్నం (కృష్ణ), డాక్టర్ నరేశ్ (కున్సి) వి ధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో టెర్మినేట్ చేసినట్లు పేరొన్నారు. ఇదే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్న యాదమ్మ సీహెచ్వో సాయిబాబాను సస్పెండ్ చేసినట్లు పేరొన్నారు.
ఆరోగ్య శాఖలో విధు లు నిర్వర్తిస్తున్న సిబ్బంది విధుల్లో నిరంతరం శ్రద్ధతో ఉండాలని సూచించారు. అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో నోడల్ అధికారి, డీఎంహెచ్వో సౌభాగ్యలక్ష్మి దవాఖానను విజిట్ చేసిన సందర్భాల్లో విధుల్లో ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కోసం జీపీఎస్ లొకేషన్ పెట్టాలని అడిగి తే, ఫేక్ ఫొటోస్ పెడుతూ అధికారులను పక్కదోవ పట్టించారని, దీం తో గతంలోనే రెండు మెమోలు కూడా జారీ చేశారని పేర్కొన్నారు. అ యినా నిర్లక్ష్యం వహించడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు.