హన్వాడ, ఆగస్టు 30 : వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ఘన విజయం సాధింస్తుందని, ఈ పార్టీతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో మండలంలోని ఇబ్రహీంబాద్ బీజేపీ పార్టీ ఎంపీటీసీ, బీజేపీ పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మమ్మ, బీజేపీ మండల కోశాధికారి అంజిల్రెడ్డి మంత్రి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. అనంతరం రక్షాబంధన్ సందర్భంగా హన్వాడ జెడ్పీటీసీ విజయనిర్మల మంత్రికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మహిళలకు మంత్రి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బాల్రాజ్, మండల కో ఆప్షన్ సభ్యుడు మన్నాన్, నాయకులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ అర్బన్, ఆగస్టు 30 : ధూప, దీప, నైవేద్యం గౌరవ వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మహబూబ్నగర్ జిల్లా అర్చకులు ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో మంత్రిని సన్మానించారు.