మక్తల్ టౌన్/ధన్వాడ/మరికల్/దేవరకద్ర, ఏప్రిల్ 13 : రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ సర్కారు ఆగమాగం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. కృ ష్ణ మండలం హిందూపూర్ బసవేశ్వర కల్యాణమండపంలో మాగనూరు, కృష్ణ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అధ్యక్షతన.., మరికల్ మండలకేంద్రంలో బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి అధ్యక్షతన.., మా జీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అధ్యక్షతన దేవరకద్ర, కౌకుంట్ల మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కా ర్యకర్తలతో శనివారం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతకుముందు మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎ మ్మెల్యే చిట్టెం.. కృష్ణ మండలకేంద్రంలోని క్షీర లింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొ క్కుతున్నదన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి బస్సుల్లో ఉచిత ప్రయాణ హామీని మాత్రమే అమలు చేసిందన్నారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతుబంధును కూడా ఇప్పటివరకు పూర్తిగా ఇవ్వలేదన్నా రు. ఎంపీ ఎన్నికల్లో మరిన్ని దొంగ హామీలతో ఓట్ల కో సం కాంగ్రెసోళ్లు వస్తారని.. వారిని లెకచేయకుండా బీ ఆర్ఎస్ను ఆదరించి పాలమూరు గడ్డపై గులాబీ జెం డాను ఎగురవేసి కేసీఆర్కు కానుకగా ఇద్దామన్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు.
అసెంబ్లీ ఫలితాలను గుర్తుంచుకొని ఎంపీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి మన్నె శ్రీనివాస్రెడ్డిని మ రోసారి ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. అధికా రం కోల్పోయాక కార్యకర్తలు భయంగా తిరుగుతున్నారని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని మనోధైర్యాన్నిచ్చారు. కేసీఆర్ సర్కారు పాలనలో ప్రతి కు టుంబానికి సంక్షేమ పథకాలు అందడంతో సుఖసంతోషాలతో జీవనం గడిపారన్నారు. కానీ, నేడు రైతులు సా గునీరు లేక అల్లాడుతున్నారని, ప్రజలు తాగునీటి కో సం అష్టకష్టాలు పడుతున్నారన్నారన్నారు. వీటినన్నింటినీ చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నదని పేర్కొన్నా రు. ఎంతో కష్టపడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలు ఇ బ్బందులు పడుతుంటే సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఐపీఎల్ మ్యాచులు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారంటూ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు కాంగ్రెస్పై దుమ్మెత్తి పోస్తున్నారన్నారు.
పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గళాన్ని వినిపించేది బీఆర్ఎస్ ఎంపీలేనన్నారు. పదేండ్లలో పార్లమెంట్ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అత్యధికంగా మాట్లాడిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంటలకు సాగునీరు అందక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వరికి ఇస్తామన్న రూ.500 బోనస్ హామీని తుంగలో తొక్కిందన్నారు. ఇలాంటి కాంగ్రెస్ పాలనకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హత్యారాజకీయాలకు పాల్పడుతున్నదని, అయోధ్య రామమందిరాన్ని అడ్డుపెట్టుకొని తమకే ఓటువేయాలంటూ అడుగుతున్నారన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలెవరూ అధైర్యపడకుండా మే 13న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఆయా సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాద వ్, టీపీసీ మాజీ చైర్మన్ దేవరి మల్లప్ప, కృష్ణ జెడ్పీటీసీ అంజనమ్మ, మాగనూర్ మాజీ జెడ్పీటీసీ అనసూయ మ్మ, దేవరకద్ర ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, మాగనూరు, మక్తల్, ఆత్మకూరు మండలాల పార్టీ అధ్యక్షులు ఎల్లారెడ్డి, మహిపాల్రెడ్డి, రవికుమార్యాదవ్, నాయకులు శివరాజ్ పాటిల్, మధుసూదన్రెడ్డి, మో నేష్, శివప్ప, ఈశ్వర్యాదవ్, మారెప్ప, శ్రీహరి, రాజవర్ధన్రెడ్డి, సంపత్కుమార్, రాజేందర్గౌడ్, వెంకటరెడ్డి, తిరుపతయ్య, కృష్ణారెడ్డి, గోవర్ధన్, రాములు, భీమయ్యగౌడ్, భీంరెడ్డి, చంద్రశేఖర్, విజయసాగర్, సుదర్శన్రెడ్డి, రామస్వామి, బాపనపల్లి, శ్రీనివాసులు, నరసింహగౌడ్, చిన్నారెడ్డి, సచిన్, సునీల్రెడ్డి, మురళీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ర్టాన్ని పదేండ్లు కేసీఆర్ సుభిక్షంగా పాలించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనతో ప్రజలు, రైతులకు కేసీఆరే గుర్తుకొస్తున్నారు. అచరణకు నోచుకోని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. రైతంగాన్ని, పేదలను కాపాడేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు కంకణబద్ధులై ముందుకు సాగాలి.
– లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పాలమూరు జిల్లా అధ్యక్షుడు
స్థానికుడైన నన్ను ఎంపీ ఎన్నికల్లో మరోసారి ఆదరించాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అధికారం కో ల్పోయింది. అయినా, ప్రతి పల్లెలో పార్టీ బలంగా పాతుకుపోయింది. ప్రతి కార్యకర్త అభ్యర్థిలా ముందుకు కదిలి ఎంపీ ఎన్నికల్లో తనను అధిక మెజార్టీతో గెలిపించాలి. పదేండ్లు రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించిన కేసీఆర్ మనమధ్యే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెసోళ్లు అలివి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తడం లేదు. స్వలాభం కోసం పాలన సాగిస్తూ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసేలా వ్యవహరిస్తున్న ది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం హత్యా రాజకీయాలు చేస్తున్నది.
అయోధ్య రామ మందిరా న్ని అడ్డుపెట్టుకొని ఎంపీ ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని ప్రజలను మభ్యపెడుతున్నది. తనను గెలిపిస్తే తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటుకు సిద్ధమవుతా. కృష్ణ మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు త్వరలోనే చర్యలు చేపడతాం. బీఆర్ఎస్ హయాంలో పదవులు అనుభవించిన నాయకులు ఓపికతో ఉండలేక ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. వారిని వెళ్లనిచ్చి ఉన్న వారితోనే పార్టీని పటిష్టంగా మార్చుకుందాం.
– మన్నె శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి
ఈ ప్రాంత అభివృద్ధి కోసమే బీ ఆర్ఎస్ అధినేత కేసీఆర్ నారాయణపేటను జిల్లాగా ప్రకటించారు. 420 హామీలిచ్చి గద్దెనెకిన కాం గ్రెస్ వాటిని అమలు చేయడంలో విఫలమైంది. నారాయణపేటకు వ స్తున్న రేవంత్రెడ్డి ఆరు గ్యారెంటీల ను ఎప్పుడు అమలు చేస్తారు? రూ.2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారో స్పష్టతనివ్వాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు కార్యకర్తలు వివరించాలి. మహాలక్ష్మి పథకం కిం ద రూ.2,500 పొందిన మహిళలు, రూ.4వేల పింఛన్ వస్తున్న వృద్ధులు, రూ.2లక్షల రుణమాఫీ పొందిన రైతులే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేయాలి. ఈ పథకాలు పొందని వారం తా బీఆర్ఎస్కు ఓటు వేయాలి.
కాంగ్రెస్ అధికారం చేపట్టాక సంక్షేమ పథకాలను నీరుగార్చింది. రెండు లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని భావించి నాటి సీఎం కేసీఆర్ పీఆర్ఎల్ఐకి శ్రీకారం చుడితే.. ప్రాజెక్టు కు సంబంధించిన టెండర్లను కాం గ్రెస్ నాయకులు రద్దు చేశారు. ఒకరేమో ధన్వాడ ఆడబిడ్డగా చెప్పుకొని ఎమ్మెల్యేగా గెలిచి మట్టి, ఇసుక వ్యాపారాలకు శ్రీకారం చుట్టారు. పే ట, పాలమూరు జిల్లాలోని ఏడుగు రు మాజీ ఎమ్మెల్యేలందరం పార్టీ సి ద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం. పార్టీ మారే ప్రసక్తే లేదు. కార్యకర్తలకు అండగా ఉంటూ బీఆర్ఎస్ను బతికించుకుంటాం. అతివిశ్వాసం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయాం. ఈసారి కష్టపడి పనిచేసి ఎంపీగా మన్నెను మరోసారి గెలిపించుకుందాం.
– రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు
స్వలాభం కోసం పార్టీలు మారే వారిని వదిలిపెడితేనే మనం బాగుపడతాం. బీఆర్ఎస్ నాయకులను బతిమాలి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. పార్టీని వీడే వారి గురించి కార్యకర్తలు ఆలోచించొద్దు. ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నవారంతా పార్టీ విజయం కోసం సైనికుల్లా పనిచేయాలి. నాడు తెలంగాణకు విద్యుత్ ప్లాంట్ మంజూరైతే.. దానిని కర్ణాటకకు తరలించి ఇక్కడి ప్రజలకు అన్యాయం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కరెంటు కోతలు, సాగునీటి కష్టాలను ఎదుర్కొనే దౌర్భాగ్యం దాపురించింది. సాగునీరివ్వలేని అసమర్థుడు ఎమ్మె ల్యే కావడం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న దురదృష్టం. కాంగ్రెస్ వస్తే కష్టాలు తప్పా మరేవీ ఉండవు. వచ్చే ఎన్నికల్లో మన్నె శ్రీనివాస్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కు పంపిద్దాం.
– చిట్టెం రామ్మోహన్రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజలకు మొండి చేయి చూపించారు. ఇలాంటి పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామన్న హామీపై ప్రతి కార్యకర్త గ్రామాల్లో ప్రజలకు వివరించాలన్నారు.
– ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే