గూడు లేని పేదలకు ప్రభుత్వం సౌధాన్ని నిర్మించి వారి కలను సాకారం చేస్తున్నది. ఇప్పటికే విలాసవంతంగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందజేస్తున్నది. గుడిసెలు లేని రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మరింత మందికి చేయూతనిచ్చేలా నూతనంగా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. సొంత జాగా ఉంటే చాలు రూ.3 లక్షల సాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రూ.లక్ష చొప్పున మూడు విడుతల్లో పూర్తి స్థాయి సబ్సిడీని అందించనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 3 వేల మందికి అందించేలా మార్గదర్శకాలు రూపొందించారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ను రూపొందించనున్నది. ఇందులో ఇండ్ల మంజూరు బిల్లుల చెల్లింపులు ఆన్లైన్లో జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో అమలయ్యే పథకంలో భాగంగా రెండు గదులు, టాయిలెట్లతో ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పూర్తయిన తర్వాత గృహలక్ష్మి లోగోను ఇంటిపై వేయనున్నారు.
గద్వాల, జూన్ 24 : సొంత స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు గృహలక్ష్మి పథకంతో ప్రభుత్వం చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే ఇల్లు లేని పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు అందించి సొంతింటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అడుగు ముందుకేశారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గూడు లేని పేదలు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికసాయం అందిస్తున్నది. ఈ సాయంతో ప్రజలు తమకు నచ్చిన రీతిలో ఇల్లు కట్టుకునే వీలు కలిగింది. చాలామందికి సొంత స్థలం ఉన్నా ఆర్థిక స్థోమత లేక ఇల్లు కట్టుకోలేక గుడిసెల్లోనే తలదాచుకుంటున్నారు. అలాంటి వారు నిత్యం అభద్రతాభావంతో జీవించాల్సి వస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్థలం ఉన్న ప్రతిఒక్కరూ ఇల్లు కట్టుకునే అవకాశం కలిగింది. గృహలక్ష్మి పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయడంతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గానికి మూడువేల ఇండ్లు
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో మూడువేల మందికి ఈ పథకం వర్తించనున్నది. లబ్ధిదారుడు తనకు నచ్చిన డిజైన్లో ఇంటిని నిర్మించుకోవచ్చు. తప్పనిసరిగా రెండుగదులు ఏర్పాటు చేసుకోవడంతోపాటు టాయిలెట్స్ ఉండాలనే నిబంధనలను ప్రభుత్వం తీసుకొచ్చింది. జిల్లాస్థాయిలో ఈ పథకం కలెక్టర్ ఆధ్వర్యంలో అమలు కానున్నది.
మహిళ పేరు మీదే ఇంటి నిర్మాణం..
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది. గృహలక్ష్మి పథకంలో భాగంగా మహిళ పేరు మీద ఇంటిని నిర్మించుకునేలా చర్యలు చేపట్టింది. సొంత జాగ ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ప్రభుత్వం ఆ ఇంటి మహిళ పేరున ఇల్లు మంజూరు చేస్తుంది. అందుకనే ఈ పథకానికి ‘గృహలక్ష్మి’ అని నామకరణం చేశారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఆమోదించిన గృహలక్ష్మి పథకం లోగోను ఇంటిపై వేస్తారు. ప్రభుత్వం అందించే నగదు రూ.3లక్షలు పూర్తి సబ్సిడీతో అందించనున్నది. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ప్రత్యేక పోర్టల్ యాప్ను రూపొందించనున్నది. ఈ యాప్లో ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపులు అంతా ఆన్లైన్లో చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
పథకానికి అర్హతలు..
నిరుపేదలకు అండగా గృహలక్ష్మి
గూడు లేని నిరుపేదలకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకంతో అండగా నిలిచింది. దీంతో మాలాంటి వారికి కొండంత ధైర్యమొచ్చింది. స్థలం ఉన్నా ఆర్థికస్థోమత లేక గుడిసెలోనే జీవిస్తున్నాం. స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.3లక్షలు సాయం ప్రకటించడం సంతోషంగా ఉంది. ఉన్న స్థలంలో మేము కూడా ఇట్లు కట్టుకుంటాం. పేదలకు ఈ పథకం ఓ వరం. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
– రాములమ్మ, జమ్మిచేడ్
గృహలక్ష్మి పథకం పేదోళ్లకు వరం
గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ. 3లక్షలు సాయం చేస్తుందని తెలిసి సంతోష ప డ్డాం. మాలాంటి పేదోళ్ల కు గూడు నిర్మించుకోవడానికి సాయం చేస్తున్న సీఎం కేసీఆర్ రుణం ఎ ప్పటికీ తీర్చుకోలేం. గృ హలక్ష్మి పథకం ద్వారా ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న సొంతింటి కల నెరవేరుతున్నది. గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నాం.
– రాజేశ్వరి , పైపాడు, వడ్డేపల్లి