మక్తల్, మే 31 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జూన్ 2వ తేదీన మక్తల్ నియోజకవర్గంలో పల్లె పల్లెలో జెండా ఆవిషరణ చేసి ఘనంగా చేపట్టాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆదివారం తన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలస పాలకుల చేతుల్లో తెలంగాణ పూర్తిస్థాయిలో నష్టపోయిందని గ్రహించిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాటాలు చేసి, స్వరాష్ట్రాన్ని సాధించిన సందర్భంగా, జూన్ 2వ తేదీని తెలంగాణలో ప్రతిఒకరూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. జూన్ 2వ తేదీ ఉదయం 8గంటలకు మక్తల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం లో జెండాను ఆవిషరించాలని బీఆర్ఎస్ నాయకులకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం పిలుపునిచ్చారు. ప్రతి ఒక గులాబీ కార్యకర్త ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని తెలంగాణ పౌరుషాన్ని చూపించాలని ఆయన వెల్లడించారు. మక్తల్ పట్టణంలో నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.