జడ్చర్లటౌన్, జూలై 4 : ఎన్హెచ్-44పై పొట్టులోడ్తో వెళ్తున్న లారీ డివైడర్ను ఢీకొని బోల్తాపడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని మాచారం గ్రామం వద్ద చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. జాతీయరహదారిపై జడ్చర్ల వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న పొట్టులారీ మాచారం గ్రామం వద్ద డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోగా.. హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్లే రహదారిపై వన్వేలో వాహనాలను దారిమళ్లించారు. జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి వద్ద హైదరాబాద్ వైపు వెళ్తున్న పాల ట్యాంకర్ను ఎదురుగా వచ్చిన టిప్పర్లారీ ఢీకొట్టింది.
ఈ సమయంలో టిప్పర్లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరితోపాటు పాలట్యాంకర్ డ్రైవర్ మహేశ్, టిప్పర్లారీ డ్రైవర్ జితేంద్రయాదవ్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో జిల్లా దవాఖానకు తరలించారు. దాదాపు నాలుగు గంటలపాటు వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్న జడ్చర్ల ఎస్సై లెనిన్ తెలిపారు.