జడ్చర్ల, అక్టోబర్ 11 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధితో అందరిచూపు బీఆర్ఎస్ వైపే ఉన్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం జడ్చర్ల మున్సిపాలిటీలోని సర్దార్వల్లబాయ్పటేల్ నగర్కు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు నాగార్జున ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ల క్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చే రారు. వీరికి ఎమ్మెల్యే తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేండ్లలోనే ఊహించని అభివృద్ధి చేశామని, ప్రజలు మరోసారి ఆశీర్వదించి మరింత అభివృద్ధికి సహకరించాలని కోరారు. కొందరు స్వార్థ రాజకీయాల కోసం ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మితే మళ్లీ అభివృద్ధి వెనక్కి వెళ్లిపోతుందన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందని, 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమాతో రైతు దీమాగా ఉన్నాడన్నారు. రెండుపంటలు పండించుకుంటూ ఇతర రాష్ర్టాల వారికి మన రైతులు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారన్నారు.
దళితబంధు ద్వారా దళితుల్లో వెలుగులు నింపేందుకు ఒక్కొక్కరికి రూ.10లక్షల ఆర్థికసాయం అందించ డం జరుగుతుందన్నారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు ఆర్థికసాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్లో చేరిన బీజేపీ నాయకుడు నాగార్జున మా ట్లాడుతూ.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హ యాంలో తొమ్మిదేండ్లలో జడ్చర్ల పట్ట ణం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అందడంతో భరోసాగా బతుకుతున్నారన్నారు. సంక్షే మ పథకాలకు ఆకర్శితులై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్ర ణీల్చందర్, కోట్ల ప్రశాంత్రెడ్డి, మరళి, చైతన్యచౌహాన్, శశికిరణ్, శంకర్నాయక్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లోకి
నవాబ్పేట, అక్టోబర్ 11 : మం డలంలోని దర్పల్లి, పోమాలకు చెందిన బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కా ర్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఎస్పీ మండల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కాంగ్రెస్, బీఎస్పీ నా యకు లు చెన్నయ్య, కృష్ణయ్య, బాలయ్య, వెంకటేశ్, సత్యం, అర్జున్, చెన్నయ్య, పో మాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రమేశ్, నరేశ్, సందీప్, వెం కటేశ్ తదితరులు బీఆ ర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్య క్షుడు నర్సిములు, నాయకులు ప్రతాప్, నాగిరెడ్డి, యూత్ వింగ్ అధ్యక్షుడు శ్రీ ను, శివ పాల్గొన్నారు.
సీఎం సభాస్థలి,
జడ్చర్లలో సీఎం కేసీఆర్ బహిరంగసభ, హెలీప్యాడ్ ఏర్పాటుకు సంబంధించి స్థ లాలను బుధవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈనెల 18వ తేదీన సీ ఎం జడ్చర్లలో నిర్వహించే ఎన్నికల బహిరంగసభలో పాల్గొననున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, సత్యం, శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.