దేవతలు, ప్రకృతి, జంతువులు, పక్షులు, రాజకీయ నేతల చిత్రాలతో భళా అనిపించుకుంటున్నాడు.. శివకుమార్. శ్రీరంగాపుర్లో ఉప తాసీల్దార్గా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు చిత్రకళలో రాణిస్తున్నాడు. సమయం దొరికినప్పుడల్లా అబ్బురపర్చేలా బొమ్మలు వేస్తున్నాడు. చిన్నతనం నుంచే ఆర్ట్పై మక్కువతో ఏదో ఒకటి వేస్తూ వచ్చాడు. తన కుంచెతో బొమ్మలకు ప్రాణం పోస్తూ పలువురిచే శభాష్ అనిపించుకుంటున్నాడు.
– శ్రీరంగాపూర్, ఏప్రిల్ 15
శ్రీరంగాపూర్, ఏప్రిల్ 15 : అతడి నుంచి జాలువారిన చిత్రాలు అద్భుతం. గీసిన ప్రతి బొమ్మ జీవం పోసుకుంటుంది. కొల్లాపూర్కు చెందిన గడ్డం శివకుమార్ శ్రీరంగాపూర్లో ఉపతాసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పాఠశాల స్థాయి నుంచి ఖాళీ సమయం దొరికినప్పుల్లా పెన్సిల్తో బొమ్మలు గీయడం ఇష్టంగా మారింది. ఈ బొమ్మలు అందంగా, అద్భుతంగా, సహజత్వానికి దగ్గరగా ఉండడంతో పలువురి ప్రశంసలు పొందాడు. ఒకపక్క డీటీగా విధులు నిర్వర్తిస్తూనే.. మరోపక్క చిత్రాలు గీస్తున్నాడు. వీలు దొరినప్పుడల్లా రాజకీయ నాయకులు, దేవతలు, ప్రకృతి చిత్రాలు, జంతువులు, పక్షుల బొమ్మలు వేసి ఆకట్టుకుంటున్నాడు.
అత్యంత సహజంగా తన కుంచె నుంచి జాలువారిన చిత్రాలను వ్వక్తిగతంగా కలిసి ప్రముఖులకు బహూకరిస్తున్నాడు. ఇటీవల సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు చిత్రపటాలను అందజేశాడు. ‘చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అంటే ఇష్టం. ఎలాంటి శిక్షణ లేకుండా బొమ్మలు గీయడం నేర్చుకున్నాను. బొమ్మలు గీయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతున్నాను. అవకాశం వస్తే పీఎం, రాష్ట్రపతిలకు స్వయంగా చిత్రపటాలను అందించాలని ఉన్నది.’ అని గడ్డం శివకుమార్ తెలిపాడు.