హన్వాడ, మార్చి 12 : ఎస్సీ హాస్టల్లో మరుగుదొడ్లు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు భరత్, కేవీపీఎస్ రాష్ట్ర నాయకుడు మాణిక్యంరాజు డిమాండ్ చేశారు. మంగళవారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్లో దాదాపుగా 150 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. హాస్టల్లో మౌలిక సదుపాయలు లేక విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణానికి రూ.6లక్షలు మంజూరైనా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
బాత్రూంలు లేకపోవడంతోపాటు ప్రహరీ లేక విషపురుగులు సంచరిస్తుండడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంత రం తాసీల్దార్ కిష్టానాయక్కు వినతిపత్రం అందజే శారు. స్పందించిన తాసీల్దార్ డీడీ పాండుతో ఫోన్ లో మాట్లాడగా నిధులు మంజూరయ్యాయని, ని ర్మాణం చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, త్వరలో మరుగుదొడ్లు నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.