నారాయణపేట, మార్చి 25 : నారాయణపేట పట్టణంలో సోమవారం జరుపుకొన్న హోలీ సంబురా ల్లో అపశృతి చోటు చేసుకున్నది. 20వ వా ర్డు పరిధిలోని గోపాల్పేట వీధిలో హోలీ సం బురాల్లో భాగంగా మంచినీటి ట్యాంకు వద్ద చిన్నారులు ఆడుకుంటుండగా అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో ఆ ట్యాంకు సిమెంట్ ముక్కలు అక్కడే ఆడుకుంటున్న చిన్నారులపై పడ్డాయి. స్థానికులు గమనించి గాయపడిన చిన్నారులు లక్ష్మీప్రణీత, హరిప్రియ, నిహారికను చికిత్స నిమిత్తం జనరల్ దవాఖానకు తరలించగా.. లక్ష్మీప్రణీత(12) మృతి చెందింది. గాయపడిన నిహారిక, హరిప్రియకు చికిత్స అందిస్తున్నారు. పం డుగ వేళ ఇలాంటి సంఘటన జరుగడంతో బాధితుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అప్పటి వరకు తమ కళ్లెదుటే ఆడుకుంటున్న చిన్నారి మృతి చెందడంతో లక్ష్మీప్రణీత కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఖిల్లాఘణపురం, మార్చి 25 : మండలంలోని మామిడిమాడలో సోమవారం హోలీ పం డుగను ఘనంగా జరుపుకొన్నారు. హోలీ అనంతరం వి ద్యార్థులు, యువకులు కలిసి స్నానం చేసేందుకు బావికి వెళ్లారు. బావిలో ఈత పడుతున్న సమయంలో శ్రీకాంత్ (16) అనే విద్యార్థి మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు అతడిని బావిలో నుంచి బయటకు తీసి వెంటనే దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంకట్రెడ్డి, యాదమ్మ, కు టుంబ సభ్యులు దవాఖానకు చేరుకొని గుండెలు బాదుకొని రో ధించారు. పండుగ పూట విద్యార్థి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.