నాగర్కర్నూల్ టౌన్, జనవరి 30 : పట్టణానికి చెందిన బీటెక్ విద్యార్థి చిదిరె సాయితేజ(19) హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్కర్నూల్ పట్టణానికి చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయుడు సతీశ్కుమార్ పెద్ద కుమారుడు సాయితేజ హైదరాబాద్లోని ఓ ప్రైవే ట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు.
కళాశాల నుం చి ద్విచక్ర వాహనంపై హాస్టల్కు వెళ్తున్న క్రమంలో ఈనెల 26వ తేదీన ఇబ్రహీంపట్నం వద్ద మరో బైక్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఓ ప్రైవేట్ దవాఖాన లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. సాయితేజ అ వయవాలను కుటుంబ సభ్యులు దవాఖానకు దానం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో అంత్యక్రియలు నిర్వహించారు.