భూత్పూర్, ఏప్రిల్ 12 : మండలంలో ని అన్నాసాగర్ గ్రామానికి చెందిన ఇంట ర్ విద్యార్థిని జక్కుల శ్రావణి(16)ఇంటర్ ఫెయిలయ్యాయని ఇంట్లో నే కిటికీకి ఉరేసుకొని మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం మేరకు అన్నాసాగర్ గ్రామానికి చెందిన జక్కుల ఆంజనేయులు, మంజుల దంపతులకు ముగ్గురు కుమార్తేలు ఉన్నారు.
వీరిలో మొదటి కూతురు శ్రావణి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ గ్రూప్ చదువుతున్నది. ఫస్టియర్లో రెండు సబ్జెక్టులు, సెకండియర్లో కూడా రెండు సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో మనస్తాపంతో మృతిచెందినట్లు సమాచారం.