ఖలీల్వాడి, మే 5 : కాంగ్రెస్ నేతలు అబద్ధాలు మాని రైతులకు మేలు చేయాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా నగరంలోని 44వ డివిజన్ పరిధిలో ఆదివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకూ వెళ్లి కారు గుర్తుకు ఓటువేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్.. మహిళలకు ఫ్రీ బస్ తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కరెంటు, సాగునీరు లేక రైతులు అల్లాడుతుంటే పట్టించుకోవడంలేదని, పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్రెడ్డి మరోసారి అబద్ధాలు మాట్లాడుతున్నాడని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. పసుపు బోర్డు తెచ్చే దమ్ము అర్వింద్కు లేదని, ప్రశ్నించే గొంతుక బాజిరెడ్డిని ఢిల్లీకి పంపిద్దామన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, ఈ సారి ఎంపీ స్థానం బీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు నీలగిరి రాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, సుజిత్సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, సూదం రవిచందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
డిచ్పల్లి/ధర్పల్లి/ఇందల్వాయి/సారంగాపూర్/మోర్తాడ్/ ఆర్మూర్టౌన్, మే 5: బాజిరెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు వివిధ మండలాల్లో ఆదివారం విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేసీఆర్ హయాంలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తూ బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. డిచ్పల్లి మండలం దేవుపల్లి, దేవనగర్ క్యాంపు, అమృతాపూర్ వడ్డెర క్యాంప్లో బాజిరెడ్డికి మద్దతుగా జడ్పీటీసీ లక్ష్మీనర్సయ్య ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు ప్రచారం చేశారు. ధర్పల్లి మండలం కోటాన్పల్లి, హొన్నాజీపేట్, వాడి, మద్దుల్ తండా గ్రామాల్లో ఎంపీపీ సారికారెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగింది. ఇందల్వాయి మండలం తిర్మన్పల్లి, వెంగల్పాడ్ తండా గ్రామాల్లో ఎంపీపీ రమేశ్నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు దాసు, ఎంపీటీసీ దాసు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ (ఏ), జలాల్పూర్, లక్ష్మాపూర్ గ్రామాల్లో మహిళా నాయకురాలు గీత ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియోలు చూపిస్తూ కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. చందూర్ మండలకేంద్రంతోపాటు రుద్రూర్ మండలం అక్బర్నగర్లో సీనియర్ నాయకులు జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు మద్దతుగా గడప గడపకూ ప్రచారం చేశారు.
భీమ్గల్, మే 5: భీమ్గల్ మండలంలోని చేంగల్ తండా, భీమ్గల్ చర్చిలలో ఆదివారం నిర్వహించిన క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనాల్లో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు యేసు ప్రభువు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.