తిమ్మాజిపేట మే 14 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన రచించిన రాజ్యాంగం వల్లే నేడు మనమంతా స్వేచ్ఛగా జీవిస్తున్నామని ఎమ్మె ల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. శనివా రం రాత్రి మండలంలోని బుద్ధసముద్రం గ్రామంలో అంబేద్కర్ విగ్రహా న్ని ఎంపీ రాములు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మావతీబంగారయ్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్తోకలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మర్రి మాట్లాడుతూ అంబేద్కర్ ఏ ఒక్కరికి చెందిన వ్యక్తి కారని, ఆయన అందరివాడన్నారు. ఆయన రాజ్యాంగం వల్లే దేశంలో సమానత్వం వచ్చిందన్నా రు.
గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం అని, ఆయన అందరికీ ఆదర్శప్రాయుడని ఆయన చూపినదారిలో అంద రూ నడవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎంపీ రాములు మాట్లాడుతూ అంబేద్క ర్ రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనదన్నారు. ప్రతిఒక్కరికీ అవకాశాలు కల్పిస్తూ ఆయన భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దారన్నారు. గిడ్డంగుల సంస్థ చైర్మ న్ సాయిచంద్ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం అంబేద్కర్ కృషి చేశారన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని సద్వినియో గం చేసుకొని దళితులు ధనికులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీంద్రనాథ్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ మా నిటరింగ్ జిల్లా సభ్యుడు ప్రదీప్, వైస్ఎంపీపీ శ్రీనివాస్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర నేత శ్రీనివాస్ బహుదూర్, సర్పంచుల సంఘం మండల అ ధ్యక్షుడు వేణుగోపాల్గౌడ్, స్థానిక స ర్పంచ్ రాణమ్మ, ఎంపీటీసీ బాలయ్య, అంబేద్కర్ సంఘం ప్రతినిధులు జాను, ప్రసాద్, బొందిలయ్య, స్వామి, జగన్రాజు, టీఆర్ఎస్ గ్రామనాయకులు, కా ర్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.