మంత్రాలయం, సెప్టెంబర్ 25 : కర్నూల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలోని మూల బృందావనానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం శ్రీమఠంకు చేరుకున్న మంత్రికి అధికారులు ఆలయ మర్యాదలతో సాగతం పలికారు.
ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను మంత్రి దర్శించుకొని పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు మంత్రిని స్వామివారి శేషవస్త్రంతో సన్మానించి, ఫలమంత్రాక్షితలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపికను అందజేసి ఆశీర్వదించారు. మంత్రి వెంట తాసీల్దార్ దేవా చంద్రశేఖర్, ఎస్సై వేణుగోపాలరాజు, శ్రీమఠం అధికారులు ఉన్నారు.