నారాయణపేట టౌన్, జనవరి 12 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతు న్న కంటి వెలుగు కార్యక్రమం ఈనెల 18 మధ్యాహ్నం ఒంటి గంటకు అన్ని జిల్లాల్లో ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. గురువారం కంటి వెలుగు కార్యక్రమం సన్నదతపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారుల తో జూమ్ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు.
కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో 24 వై ద్య బృందాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించ డం, వైద్య యంత్రాలు సమకూర్చుకోవడం జరిగిందన్నారు. వైద్య శిబిరాలకు అవసరమైన టెం ట్లు, టేబుళ్లు, తాగునీరు తదితర ఏర్పాట్లపై మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు ఆదేశాలు జారీ చే సినట్లు చెప్పారు. దిగువ స్థాయికి అవసరమైన ఉ త్తర్వులు, ఆదేశాలు జారీ చేశామని, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు అవగాహన కల్పించి శిక్షణ కూడా ఇ చ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాకు ఇప్పటి వరకు ఇచ్చి న కంటి అద్దాలు ఆయా మండలాలకు సరఫరా చేయడం పూర్తి అయిందని తెలియజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పరిధిలో గృహ నిర్మాణాలు చేపట్టే యజమానులు మన ఇసుక వాహనం వెబ్సైట్లో కోస్గి మండలంలోని వాగు నుంచి ఇసుకను బుక్ చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష గురువారం ప్రకటనలో తెలిపారు. గృహ నిర్మాణ అవసరాలకు ఇబ్బంది లేకుండా https://tsmiv.cgg.gov.in/hom e వెబ్సైట్లో బుక్ చేసుకుంటే అదేరోజు లేదా త ర్వాత రోజు ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందన్నారు.