పెబ్బేరు, ఆగస్టు 16 : ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు వాటిని సమానంగా స్వీకరించి క్రీ డాస్ఫూర్తిని అవలవర్చుకోవాలని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. పెబ్బేరులో మూ డ్రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అంతర్ జి ల్లాల ఫుల్బాల్ టోర్నమెంట్ను బుధవారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేసిందన్నారు. రాష్ట్రంలోని క్రీడాకారులకు సీఎం కేసీఆర్ చేయూతనందిస్తున్నారన్నారు. క్రీడాకారులు ఈర్ష్యాద్వేషాను వీడి స్నేహపూర్వక వాతావరణంలో ఆ టలు ఆడాలన్నారు. ప్రముఖ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని ముందుకు అడుగులు వేయాలన్నారు. జ్ఞానసమపార్జనతోనే ఆత్మతృప్తి లభిస్తుందని చెప్పారు. ని త్యం కొత్త విషయాలను తెలుసుకోవాలన్నారు. జాతీ య, అంతర్జాతీయ క్రీడాకారులను ఎందరినో వెలుగులోకి తెచ్చిన ఘనత వనపర్తి జిల్లాకు దక్కుతుందని పేర్కొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు సమయం దొరికినప్పుడు వనపర్తి జిల్లా అభివృద్ధి, పర్యాటక ప్రదేశాలను దర్శించుకోవాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తాను ఫుట్బాల్ క్రీడాకారుడినని తెలిపారు. క్రీడ లు మానసికోల్లాసానికి, ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు. అంతకుముందు కలెక్టర్ క్రీడాపతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో క్రీడల శాఖ జిల్లా అధికారి సుధీర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్ చైర్మన్ కర్రెస్వామి, కమిషనర్ ఆదిశేషు, అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణకుమార్రెడ్డి, తాసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాములు, పట్టణ అధ్యక్షుడు దిలీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హోరాహోరీగా పోటీలు ..
వనపర్తి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూరాల క్యాంపులో జరిగిన పోటీలు హోరాహోరీగా కొ నసాగాయి. సీనియర్ విభాగం ఫుట్బాల్ పోటీల్లో మొదటి రోజు పలు జిల్లా జట్లు తలపడ్డాయి. 1-0 తే డాతో, ఆదిలాబాద్పై వనపర్తి 3-1 తేడాతో, నల్లగొం డపై ఖమ్మం 3-2 తేడాతో, నిజామాబాద్పై క రీంనగర్ జట్టు 1-0 తేడాతో విజయం సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.