ఉపాధ్యాయులకు సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రకటనతో ఉపాధ్యాయులు సంబురపడుతున్నారు. ఈ వారంలో ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కానుండగా, వచ్చే నెల 10వ తేదీలోగా పూర్తి చేయనున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా ప్రక్రియను పూర్తి పారదర్శ కంగా నిర్వహించనున్నారు. బదిలీలు మాత్రం విద్యా సంవత్సరం ముగిసే రోజు నుంచి వర్తించనున్నాయి. దీంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 3,139 పాఠశాలల్లో ఉన్న 16,288 వేల మంది ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరనుండగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్కర్నూల్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయుల కల సాకారం కానున్నది. సంక్రాంతి సందర్భంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీ లు చేపట్టాని సీఎం కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు విద్య, ఆర్థిక శాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్రావు అన్ని ఉపాధ్యాయ సంఘాల తో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ఏండ్ల తరబడిగా బదిలీలు, పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు సంబురపడుతున్నారు. ఈ వారంలోనే మార్గదర్శకాలను విడుదల చే యనున్నారు.
ఫిబ్రవరి 10వ తేదీలోగా ఈ ప్రక్రియ ను పూర్తి చేసేలా షెడ్యూల్ విడుదల కానున్నది. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించనున్నది. ముందుగా హెడ్మాస్టర్లను బదిలీ చేయనున్నారు. ఈ క్రమంలో ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతుల కల్పన జరగనున్నది. చివరగా బదిలీలు చేపట్టనున్నారు. అయితే, ఈ బదిలీలు మాత్రం ఏప్రిల్లో విద్యాసంవత్సరం ముగిసే రోజు నుంచి వర్తించనున్నాయి. ప్రస్తుతం వి ద్యార్థులకు వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ప దో తరగతి పరీక్షల విధానం మారడంతోపాటు ప్రత్యే క తరగతుల నిర్వహణ, మనఊరు-మనబడి వంటి పథకం అమలు పనులు జరుగుతున్నాయి. దీంతో వి ద్యా సంవత్సరానికి ఆటంకం కలగకుండా, విద్యార్థు ల చదువులకు ఇబ్బందులు రాకుండా పదోన్నతులు, బదిలీలు చేపట్టనున్నారు.
గతంలో 317జీవోతో పలువురు ఉపాధ్యాయులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురుచూస్తూ ఉ న్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి డిమాండ్లు లేకున్నా ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో న్యాయం చేసేలా ప్రభుత్వం పరిశీలిస్తున్నది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు చర్చించడం గమనార్హం. ఇదే క్రమంలో కస్తూర్బా, మోడల్ స్కూళ్లలోని ఉపాధ్యాయుల బదిలీలనూ చేపట్టనున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 72 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. జిల్లాల ఆవిర్భావం తర్వాత 2018 జూలైలో తొలిసారిగా బదిలీలు జరిగితే, పదోన్నతులు మాత్రం 2015లో జరిగాయి. కొన్నేండ్ల తరవాత జరిగే పదోన్నతులు, బదిలీలతో ఉపాధ్యాయులు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో మంచి పోస్టింగ్ వస్తుందని ఆశిస్తున్నారు.
ఉపాధ్యాయుల పూర్తి వివరాలను విద్యాశాఖ ఇటీవలే ఆన్లైన్ ద్వారా సేకరించింది. ఇందులో ఉపాధ్యాయుల సీనియార్టీ, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం, విధుల్లో చేరిన రోజు వంటి వివరాలు పొందుపర్చారు. షెడ్యూల్ విడుదలైతే ఆన్లైన్ ద్వారా సులువుగా పదోన్నతులు, బదిలీలు జరగనున్నాయి. మార్గదర్శకాల కోసం వేలాది మంది ఉపాధ్యాయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మార్గదర్శకాల ప్రకారం చర్యలు..
ప్రభుత్వం వెలువరించే మార్గదర్శకాల ప్రకారం పదోన్నతులు, బదిలీలు చేపడ తాం. ఇప్పటికే ఉపాధ్యాయు ల సీనియార్టీ, పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పదోన్నతులకు అర్హులతోపాటు ఖాళీలపై పూర్తి సమాచారం ప్రభుత్వానికి నివేదించాం. విద్యాశాఖ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ప్రక్రియ చేపడతాం.
– గోవిందరాజులు, డీఈవో, నాగర్కర్నూల్
ప్రభుత్వ నిర్ణయం సంతోషకరం..
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సీఎం కేసీఆర్ నిర్ణయించడం సంతోషకరం. ఎన్నో ఏండ్ల నుంచి ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రులు సబితాఇంద్రారెడ్డి, హరీశ్రావు సమక్షంలో చర్చలు మంచిగా జరిగాయి. 317 జీవోతో జరిగిన ఇబ్బందులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ వారంలో విడుదలయ్యే మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది.
– పర్వత్రెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి