మహబూబ్నగర్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఊరట లభించింది. ఎన్జీటీ తీర్పుపై స్టే విధిస్తూ కోర్టు నిర్ణయం వెల్లడించింది. దీంతో పాలమూరు ఎత్తిపోతల పనుల కు ఆటంకాలు తొలిగిపోయాయి. ఉమ్మడి జిల్లాతోపాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీటిని అందించే ఈ లిఫ్ట్పై కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు.
పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మిస్తున్నారని పిటిషన్లు వేశారు. దీనిపై విచారించిన ఎన్జీటీ ఎత్తిపోతల పథకంపై స్టే విధిస్తూ భారీ జరిమానా వి ధించింది. ఇప్పటికే అనేక కోర్టుల్లో ఉమ్మడి జిల్లా కు చెందిన కొందరు విపక్షనేతలు కేసులు పెట్టి లిఫ్ట్ పనులకు అడ్డుకొని శనిలా దాపురించారు. దీంతో ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో పనులకు అడ్డంకులు తొలగనున్నా యి. ఇక పనులు చకచకా కొనసాగనున్నాయి. తాగునీటి కోసం 7.1 టీఎంసీలు వాడుకోవచ్చు.