కాంగ్రెస్ నేతల గూండాగిరి రోజురోజుకూ పెట్రేగిపోతున్నది. ని త్యం ఎక్కడో ఒకచోట బీఆర్ఎస్ అభ్యర్థులు, ప్రచారం చేస్తున్న గులాబీ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పోటీకూడా ఇవ్వలేమని భా వించిన కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. కోస్గి మండలంలోని సర్జఖాన్పేట్ గ్రా మంలో ఉప్పల్ నియోజకర్గంలోని సో మశేఖర్రెడ్డి అనుచరులు 30 మం ది మంగళవారం ప్రచారం చే సేందుకు వచ్చారు. అయి తే, కాంగ్రెస్ గ్రామ స ర్పంచ్, ఆయన అ నుచరులు ప్రచారవా హనాలపై రాళ్లతో దాడి చేశారు. కారు అద్దాలు పగిలిపోగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. విష యం తెలుసుకున్న ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం అం బేద్కర్ చౌరస్తాలో ధర్నా చే స్తుండగా.. కాంగ్రెస్ నాయకులు ముప్పేట రాళ్ల దాడికి పాల్పడ్డా రు. దీంతో పలువురు నేతలకు గాయాలయ్యాయి. ఓటమి భయంతోనే రేవంత్రెడ్డి వర్గీయులు దాడులకు దిగినట్లు ఎమ్మెల్యే పట్నం తెలిపారు.
– కోస్గి, నవంబ$ర్ 14
కోస్గి, నవంబర్ 14 : కొడంగల్ నియోజకర్గంలో కాంగ్రెస్ నాయకుల రౌడీఇజం రోజురోజుకూ పెరుగుతున్నది. నిత్యం ఎక్కడో ఒకచోట బీఆర్ఎస్ అభ్యర్థులు, ప్రచారం చేస్తున్న గు లాబీ పార్టీ నేతలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమం లో నారాయణపేట జిల్లా కోస్గి, సర్జఖాన్పేట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉప్పల్ నియోజకర్గంలోని సోమశేఖర్రెడ్డి అనుచరులు 30 మంది మంగళవా రం సర్జఖాన్పేటలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రశాంతంగా ప్రచారం చేసు కుంటున్న గులాబీ పార్టీ నేతల వాహనాలపై కాంగ్రెస్ నేత, గ్రామ సర్పంచ్ హరీశ్గౌడ్, నాయకుడు లక్ష్మీనారాయణగౌడ్, రాఘవేందర్గౌడ్, శెట్టి శివకుమార్, మద్దూరు బాలు, ఉప సర్పంచ్ మూచ అశోక్, ఎండీ కాశీం రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో సోమశేఖర్కు చెందిన సఫారీ వాహనం అద్దాలు పగిలి పోయాయి. దీంతో బీఆర్ఎస్ నేతలకు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదంతో తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీ సులు ఘటనాస్థలికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోస్గి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తర్వాత స్టేషన్ను కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చేరుకోవడంతో ఉద్రిక్త వాతా వరణం నెలకొన్నది. సీఐతో ఎమ్మెల్యే మాట్లాడి దాడికి పాల్పడి న వారిపై కేసు నమోదు చేయాలన్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్దకు నాయకులు చేరుకొని ధర్నా చేపట్టారు. రేవంత్రెడ్డి డౌన్డౌన్ అంటూ గులాబీ శ్రేణులు నినాదాలు చేశారు. అయితే ఇదే సమయంలో శివాజీ చౌరస్తాలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ శ్రేణులపై ముప్పేట రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురు నేతలకు గాయాలయ్యాయి. విజయ్కుమార్, మైబు, లక్ష్మారెడ్డి, రమేశ్తోపాటు పలువురు గాయపడగా.. పోలీసులు, స్థానిక నాయకులు కోస్గి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. స్థానిక బీఆర్ఎస్ నేత వెంక టనర్సింహులకు చెందిన షిఫ్ట్ డిజైర్ కారు అద్దాలు కాంగ్రెస్ నేతల దాడిలో పగిలాయి.
కోస్గి, నవంబర్ 14 : బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తుంటే ఓడిపోతామనే భయంతో పిరికిపందలా రేవంత్రెడ్డి వర్గాలు దాడులకు పాల్పడడం సిగ్గుచేటని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం కోస్గిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డి ఓడిపోతామని తెలిసి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలను భ్రయబంతులకు గురిచేసి గెలుపొందాలని చూస్తున్నారని ఆరోపించారు. కొడంగల్లో రేవంత్రెడ్డి ఘోరమైన ఓటమి చవిచూడడం ఖాయమని, ఎన్నిడ్రామాలు చేసినా ప్రజలు నమ్మరన్నారు. గతంలో హస్నాబాద్లో ఇంలాంటి డ్రామాలే చేశారని గుర్తుచేశారు. నేను సీఎం అయిన తర్వాత మీ అంతు చూస్తానంటూ మీడియాను సైతం బెదిరిస్తున్నారని, ఇంతటి దిగజారుడు రాజకీయాలను గతంలో ఎప్పుడూ తెలంగాణ ప్రజలు చూడలేదన్నారు. సీఎం అవుతానని పగటికలలు కంటున్నారని, ఇలాంటి రౌడీరాజకీయ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్కు అధికారమిస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందనేందుకు బీఆర్ఎస్ నేతలపై జరుగుతున్న దాడులే నిదర్శనమని ప్రజలు గుర్తించాలన్నారు.