‘బీజేపీది అధికార దాహం.. ఎప్పుడు చూసినా ఆ పార్టీ నేతలు లేని పోని అబద్ధాలను ప్రచారం చేస్తుంటారు.. జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి ప్రారంభమైన ప్రజాసంగ్రామ యాత్రలో సైతం బండి సంజయ్ తొండి మాటలు మాట్లాడుతున్నారు’..అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. శుక్రవారం గద్వాల క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహంతో కలిసి మంత్రి ప్రెస్మీట్లో మాట్లాడారు. బీజేపీ చేపట్టిన యాత్రను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అసలు ఈ యాత్రలో పాల్గొంటున్నది ఈ ప్రాంత వాసులు కాదని.. అందరూ వలసవాదులే అని మంత్రి విమర్శించారు.
గద్వాల, ఏప్రిల్ 15 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ది అధికార దాహమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయం లో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహంతో కలిసి ప్రెస్మీట్లో మంత్రి మాట్లాడారు. పాలమూరు జిల్లాలో బండి చేస్తున్నది.. ప్రజా సంగ్రామ యాత్ర కా దని.. తొండి యాత్ర అని ఎద్దేవా చేశారు. యాత్రకు స్థానిక ప్రజల నుంచి స్పందన లేదన్నారు. తెలంగాణ రాష్ర్టానికి ఏం చేశారని కమలం పార్టీ నేతలు పాదయా త్ర చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇప్పించారని పాదయాత్ర చేస్తున్నారా..? అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసుకొని సాగునీటి రాకతో పచ్చబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాను విచ్ఛిన్నం చేయడానికే ఈ యాత్ర అని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ర్టాభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి నేటికీ నోరు మెదపడం లేదని విమర్శించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి రాక ముందు ఎన్నో హామీలు గుప్పించింద ని, అధికారం చేజిక్కించుకున్నాక తెలంగాణకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ అమలు చేయలేదన్నారు.
గుడి పేరు మీద కమలం పార్టీ నాయకులు 30 ఏండ్లుగా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఒక్క ఆలయానికి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. బీజేపీ ఎజెండా దేశం అభివృద్ధి చేయడం కాదని.. అల్లకల్లోలాలు సృష్టించి అధికారంలోకి రావడమే అని ఆ గ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు నడిగడ్డ గు రించి బండి సంజయ్కు ఏం తెలుసని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఎండబెట్టేందుకే అప్పర్భద్రకు, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని, ఇది తెలంగాణపై కేంద్రం చూయిస్తున్న వివక్ష కాదా అన్నారు. జోగుళాం బ బ్యారేజ్కు జాతీయ హోదా ఇప్పిస్తామని యాత్రలో స్పష్టం చేయాలని బండిని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కర్షకులు అధోగతి పాలు కా వాల్సిందే అని హెచ్చరించారు. బీసీ గణన ఎందుకు చేయడం లేదని మంత్రి ప్రశ్నించారు. పాదయాత్రలో పాల్గొనే వారంతా ఈ ప్రాంత వాసులు కాదని.. అం దరూ వలస వాదులే అన్నారు. ఈ ప్రాంత వాసులు ఎ వరూ పాల్గొనడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ బి ల్లులను కేంద్రం తొక్కి పెట్టిందన్నారు. బీసీ గణన ఎం దుకు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ మతం పేరు మీద రాజకీయం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు.
పాదయాత్ర అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవాలి కానీ, వారిని మభ్యపెట్టడానికి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో అమలు కాని అనేక సంక్షేమ పథకాలు తెలంగాణలో అ మలువుతున్నాయన్నారు. ఆంధ్రాకు నీళ్లు ఇవ్వడానికి నాడు హారతులు పట్టి సంబురపడిన మీరు పాదయాత్ర చేయడం సిగ్గు చేటన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. బండి భాష, యాస నేర్చుకో.. అని మంత్రి శ్రీనివాస్గౌడ్ హితవు పలికారు. కమలం పా ర్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని ఓర్వలేకపోయారని గుర్తు చేశారు. జోగుళాంబ ఆలయాభివృద్ధికి 50 సార్లు తిరిగితే రూ.50 కో ట్లు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రూ.12 వందల కోట్లతో యాదగిరిగుట్టను ముఖ్యమంత్రి అభివృద్ధి చేసినా ఏనాడు రాజకీయం చేయలేదన్నారు. బండి సంజయ్ మాటలు విని రాష్ట్రంలో రైతులు వరి సాగు చేశారని.. ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రైతులు పండించిన ధాన్యం కొ నుగోలు చేస్తామని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి.. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. లక్షల కోట్లతో లాభాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న ఘనత బీజేపీదే అన్నారు. దీంతో యువతకు ఉద్యోగావకాశాలు లేకుండా చేశారన్నారు. బీజేపీకి అధికారం ఇస్తే మోటర్లకు మీటర్లు పెడుతారని చెప్పారు. నడిగడ్డలో ఉండే ఓ నాయకురాలు ఇతర వర్గాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో బండి సంజయ్ చేస్తున్న యాత్ర బూటకమని ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం విమర్శించారు. వారు పాద యాత్ర చేసిన గ్రామాలు అపవిత్రమయ్యాయని, వాటిని కృష్ణా-తుంగభద్ర నీటితో శుభ్రం చేస్తామని చెప్పారు. వారికి ఉన్న కాళ్ల నొప్పులు పోగొట్టుకోవడానికి పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ యాత్రతో ప్రజలకు ప్రయోజనం లేదన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ఎంపీపీలు ప్రతాప్గౌడ్, రాజారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.