నారాయణపేట, జూన్ 8: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న మిషన్ కాకతీయ పథకం ద్వారా మండుటెండల్లోనూ చెరు వులు జలకళను సంతరించుకున్నాయని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పట్టణ శివారులోని కొండారెడ్డిపల్లి చెరువు వద్ద ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిసర గ్రామాల ప్రజలు, రైతులు బోనాలు, బతుకమ్మలతో చెరువు వద్దకు చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే చెరువు గట్టున కట్ట మైసమ్మకు పూజలు చేసి స్థానికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువు గట్లపై ఊరూరా ఉత్సవాలు జరుపుకోవడం తెలంగాణ సాధన కోసం తాము పడ్డ కష్టానికి ప్రతిఫలమన్నారు. చెరువుల్లో నీళ్లుంటే రైతులే కాకుండా మత్స్యకారులు, రజకులు, వివిధ వర్గాల వారికి ఉపాధి దొరుకుతుందన్నారు. కొండారెడ్డిపల్లి చెరువు అభివృద్ధికి ప్రభుత్వం రూ. 4కోట్లు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి స్వాతిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖ, జడ్పీటీసీ అంజలి, కౌన్సిలర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్ జూన్ 8: మండల పరిధిలోని సింగారం, జాజాపూర్, అప్పక్పల్లి, కొల్లంపల్లి, కోటకొండ, అంత్వార్, అప్పిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ అమ్మకోళ్ళ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ సుగుణ, జెడ్పీటీసీ అంజలి, పీఏసీసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు కోట్ల జగన్మోహన్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాములు, యూత్ అధ్యక్షుడు మోహన్నాయక్, మైనార్టీ అధ్యక్షుడు అలీషేర్, ఎంపీడీవో రాజు , ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
చెరువులకు జలకళ
కోస్గి, జూన్ 8: మండుటెండల్లో కూడా చెరువులు నీటితో కళకళ లాడుతున్నాయని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం కోస్గి మున్సిపాలిటీలోని బంధం చెరువువద్ద నిర్వహించిన చెరువుల పండుగలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పూడికలతో నిండిపోయిన చెరువులు, కుంటలను ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్కాకకతీయ పథకం ద్వారా పునరుద్ధ్దరించడంతో వేసవిలోనూ చెరువులు జలకళను సంతరించుకొని భూగర్భజలాలు పెరగడంతో రైతులు రెండుపంటలుసాగు చేసుకుంటున్నారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో త్వరలో కోడంగల్ నియోజకవర్గానికి సాగునీరు అందనుందన్నారు. అనంతరం చెరువు వద్ద ప్రత్యేకపూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రామకృష్ణ, ఎంపీపీ మధుకర్రావు, మున్సిపల్ చైర్ పర్సన్ శిరీష, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
దామరగిద్దలో..
దామరగిద్ద జూన్ 8: మండల కేంద్రంతో పాటు బాపన్పల్లి, కానుకుర్తి, విఠలాపూర్, క్యాతన్పల్లి, కందెన్పల్లి గ్రామాల్లో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. అనంతరం చెరువు గట్లపై సహపంక్తి భోజనాలు చేశారు. 30 సంవత్సరాల కిందట చెరువుల తల్లికి ఇలా పూజలు చేసేవారమని తిరిగి స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో చే సుకుంటున్నామని సీనియర్ నాయకులు కందెన్పల్లి సత్యనారాయణ అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, వైస్ఎంపీపీ దామోదర్రెడ్డి, నాయకులు భీమయ్యగౌడ్, సోషల్ మీడియా నాయకులు పుట్టి అంజి, జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్య, సర్పంచులు వన్నడి ఆశమ్మ, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.
నర్వలో..
నర్వ, జూన్ 8 : మండల కేంద్రంతోపాటు లంకాల, పెద్దకడుమూర్, పాతర్చేడ్, కొత్తపల్లి, కల్వాల తదితర గ్రామాల్లో చెరువు పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మహిళలు బతుకమ్మలతో డప్పు వాయిద్యాలతో ర్యాలీగా చెరువుల వద్దకు చేరుకొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములు శెట్టి, జెడ్పీటీసీ గౌని జ్యోతిరెడ్డి, వైస్ఎంపీపీ వీణావతి, రైతు సమితి మండల అధ్యక్షుడు మండ్ల చిన్నయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేశ్వర్రెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మరికల్లో..
మరికల్, జూన్ 8 : మండల కేంద్రంతో పాటు మాద్వార్, ఎలిగండ్ల, పెద్దచింతకుంట, వెంకటాపూర్, ఇబ్రాహీంపట్నం, రాకొండ, పుసల్పాడ్, అప్పంపల్లి, కన్మనూర్, జిన్నారం, చిత్తనూర్, ఏక్లాస్పూర్, పస్పుల, గ్రామాల్లో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రవికుమార్, మరికల్ సర్పంచ్ కస్పే గోవర్ధన్, సర్పంచులు శ్రీనివాస్రెడ్డి, దేవమ్మ, పుణ్యశీల, మండల విజిలెన్స్ కమిటీ సభ్యులు రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతయ్య, నాయకులు చంద్రశేఖర్, నర్సింహులు, పంచాయతీ కార్య దర్శి శ్రీనివాస్రావు, బీఆర్ఎస్ నాయకులు బాలస్వామి, హన్మంతు, విష్ణుకాంత్రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నర్సింహారెడ్డి, మండల వ్యవసాయశాఖాధికారి శివకుమార్, పాల్గొన్నారు
కృష్ణలో..
కృష్ణ, జూన్ 8 : మండలంలోని మూడుమాల, గుడెబల్లూర్, మురహరిదొడ్డి, ఖాన్దొడ్డి గ్రామంలో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బతకమ్మలతో తరలి వచ్చి గంగమ్మ ఒడిలో వదిలారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, ఏవో సుదర్శన్గౌడ్, తాసీల్దార్ రమేశ్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ధన్వాడలో..
ధన్వాడ, జూన్ 8: మండలంలోని గున్ముక్ల, మంత్రోనిపల్లి, ధన్వాడ, రాంకిష్టయ్యపల్లి, పాతపల్లి, చెర్లపల్లి, గోటూర్, కొండాపూర్, మందిపల్లి, కొండ్రొనిపల్లి గ్రామాల్లో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు చెరువుల వద్ద బతకమ్మలతో ఆడిపాడి నిమజ్జనం చేశారు. అనంతరం సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమంలో తాసీల్దార్ నాగలక్ష్మి, ఎంపీడీవో సద్గుణ, సర్పంచులు ఆమరేందర్రెడ్డి, నారాయణరెడ్డి, శాంతమ్మ, చంద్రప్ప, కృష్ణయ్య, పంది పద్మ, మాధవరెడ్డి, విమలమ్మ, ఎంపీటీసీలు మాధవి, కపడయ్య, సుధీర్కుమార్, కొండమ్మ, విమలమ్మ, ఐబీ డిప్యూటీ కిరణ్కుమార్, ఏఈ శివనాంద్, బీఆర్ఎస్ నాయకులు వెంకట్రెడ్డి, చంద్రశేఖర్, చిట్టెం శ్రీదేవి పంచాయతీ కార్యదర్శులు ఆంజనేయులు, చంద్రశేఖర్, మండల మహిళా సమాఖ్య ఆధ్యక్షురాలు మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్లో..
మాగనూర్, జూన్ 8: మండలంలో చెరువుల పండుగలో ప్రజాప్రతినిధులు రైతులు, మత్స్యకారులు, మహిళలు పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువు గట్టుపై వున్న కట్టమైసమ్మ, గంగమ్మకు పూజలు చేశారు. అనంతరం నాయకులు, అధికారులు ప్రజలతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ లు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఏర్పాటుతోనే అభివృద్ధ్ది
మక్తల్ టౌన్, జూన్ 8: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే చెరువుల అభివృద్ధ్ది జరిగి నీటిసామర్థ్యం పెరిగిందని ఈఈ సంజీవ్ప్రసాద్ అన్నారు. మక్తల్ మినీ ట్యాంక్బండ్పై మున్సిపల్ చైర్పర్సన్ పావని అధ్యక్షతన జరిగిన చెరువుల పండుగకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై చెరువుల అభివృద్ధి గురించి రైతులకు వివరించారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా మక్తల్ డివిజన్ పరిధిలో 235 చెరువులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధి చేయడంతో, మత్స్య సంపద భారీస్థాయిలో పెరిగిందన్నారు. అంతకు ముం దు మహిళలు బతుకమ్మలతో ఆడిపాడారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ చద్రకళ, డీఈ సతీశ్, ఏఈ మోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ అఖిల, కమిషనర్ మల్లిఖార్జునస్వామి, కౌన్సిలర్లు సత్యనారాయణ, రాములు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.