మహబూబ్నగర్టౌన్, జనవరి 6 : సంక్రాంతి పండుగ కోసం ఆర్టీసీ అధికారులు ప్ర త్యేక దృష్టి సారించారు. ప్రయాణికులకు ఇ బ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేశారు. శనివారం నుంచి 15వ తేదీ వరకు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోల నుంచి 420 అదనపు బస్సు సర్వీసులు నడపనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజలు పండుగ కోసం స్వస్థలాలకు వచ్చే అవకా శం ఉండడంతో హైదరాబాద్కు అదనపు సర్వీసులు నడపడానికి తగిన ఏర్పాట్లు చేశారు. అన్ని డిపోలకూ హైదరాబాద్ రూట్లోనే ఎక్కువ ఆదాయం వస్తుండడంతో అ దనపు సర్వీసులు కూడా ఎక్కువగానే నడపనున్నారు. ప్రత్యేక బ స్సుల్లో సైతం సాధారణ చా ర్జీలే వసూలు చేయనున్నారు. ముఖ్యంగా అ చ్చంపేట, తెలకపల్లి, డిండి, గద్వాల, అయిజ, కల్వకుర్తి, ఆమనగల్లు, కొల్లాపూర్, కోస్గి, మహబూబ్నగర్, జడ్చర్ల, నాగర్కర్నూల్, బిజినేపల్లి, నారాయణపేట, మద్దూర్, మరికల్, మక్త ల్, షాద్నగర్, ఆరంఘర్, వనపర్తి, ఖిల్లాఘణపురం, పెబ్బేరు, కొత్తకోట తదితర ప్రాంతాలకు ఆయా డిపోల నుంచి బస్సులు నడపనున్నారు. డిపోల వారీగా మహబూబ్నగర్ నుం చి 59, షాద్నగర్ నుంచి 57, వనపర్తి నుంచి 58, గద్వాల నుంచి 48, నారాయణపేట నుం చి 45, కొల్లాపూర్ నుంచి 41, నాగర్కర్నూల్ నుంచి 38, కల్వకుర్తి నుంచి 39, అచ్చంపేట నుంచి 35 అదనపు సర్వీసులు నడిపిస్తారు.
ఏపీకి అదనపు బస్సులు..
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు అదన పు బస్సులు (సూపర్ లగ్జరీ) నడపనున్నారు. మహబూబ్నగర్ నుంచి ఎంజీబీఎస్కు వెళ్తా యి. అక్కడి నుంచి రాజమండ్రి, అమలాపు రం, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ తదితర ప్రాంతాలకు బస్సులు నడపనున్నారు.
నేటినుంచి ప్రత్యేక బస్సులు..
సంక్రాంతికి వ చ్చే ప్రయాణికుల కు ఇబ్బంది లే కుండా అన్ని డి పోల నుంచి అదనపు బస్సు సర్వీసులు నడిపిస్తు న్నాం. రీజియన్ పరిధిలో 9 డిపో ల నుంచి 420 బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేశాం. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నేటినుంచి 15వ తేదీ వరకు అదనపు బస్సులు నడిపిస్తున్నాం. దూరప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు ముందస్తు రిజర్వేషన్ కూడా చేసుకోవ చ్చు. ప్రయాణిలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడపడానికి చర్యలు తీసుకుంటాం.
– వి.శ్రీదేవి, ఆర్టీసీ ఆర్ఎం, మహబూబ్నగర్