వనపర్తి టౌన్, జనవరి 30 : వనపర్తి మండలం చిట్యాల గ్రామ సమీపంలో ఉన్న మార్కెట్ యార్డును శుక్రవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నాయకులతో కలిసి సందర్శించారు. ముందుగా వేరుశనగ పంట దిగుబడిని పరిశీలించి రైతులు, కార్మికులను అప్యాయంగా పలకించారు. మార్కెట్లో ఉన్న వేరుశనగ ధాన్యరాశులను పరిశీలించి దిగుబడి, మద్దతు ధరపై మహిళా రైతులను అడిగి తెలుసుకున్నారు.
మహిళా రైతులు ఈ సంవత్సరం దిగుబడి పెరిగిందని మద్దతు ధర కూడా సంతృప్తికరంగా వచ్చిందని మీ హయాంలో పుష్కలంగా సాగునీరు రావడం వల్లే ఇది సాధ్యమైందని మాజీ మంత్రితో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ట్రేడర్లతో మాజీ మంత్రి సమావేశమై ట్రేడర్స్, కమీషన్ ఏజెంట్ల, మిల్లర్లు, హమాలీలు, దడవాయి చాట కూలీలు, రైతులను కలిసి తమ తమ వార్డులలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. సానుకూలంగా స్పందించిన వారు తమరి హయాంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని కచ్చితంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, వివిధ వార్డుల అభ్యర్థులు కార్యకర్తలు ఉన్నారు.