నాగర్కర్నూల్, డిసెంబర్ 24 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవడం.. ప్రాజెక్టుల నుం చి సాగునీరు పుష్కలంగా అందుతున్నదని తెలిపారు. యాసంగి సీజన్కు మార్చి 31వ తేదీ వరకు నీరిచ్చేందుకు సాగునీటి సలహాబోర్డు(ఐఏబీ)లో తీర్మానం చేస్తున్నట్లు చెప్పారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా పాలెం వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల ఐఏబీ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కలెక్టర్లు ఉదయ్కుమార్, షేక్యాస్మిన్బాషా, జెడ్పీ చైర్పర్సన్లు శాంతకుమారి, సరితా, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మూడు జిల్లాల కు సంబంధించిన సమావేశాన్ని మాత్రమే నిర్వహించామని, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు త ర్వాత నిర్వహిస్తామన్నారు. జూరాల డ్యాం నుంచి 34, 900 ఎకరాలకు.. ఎడమ కాల్వకు 19,400 ఎకరాలు, కుడి కాల్వకు 15,500 ఎకరాలకు సాగునీరు వారబం ధి పద్ధతిలో ఇచ్చేందుకు ప్రణాళికలు చేసినట్లు తెలిపా రు.
ఎంజీకేఎల్ఐ కింద 2.64 లక్షల ఎకరాల ఆరుతడి పంటలకు మార్చి 31 వరకు నీరిస్తామన్నారు. యా సంగి సీజన్లో ఆరుతడి పంటలే సాగు చేయాలని సూ చించారు. నూనె, పప్పుగింజల సాగుపై వ్యవసాయ, రె వెన్యూ, ఇరిగేషన్ అధికారులు అవగాహన కల్పించాల ని ఆదేశించారు. నాలుగు రోజులు విడుదల, మూడు రోజులు నిలుపుదల పద్ధతిలో సాగునీళ్లు ఇస్తామన్నారు. భీమా-27వ ప్యాకేజ్కు మాత్రం 10 రోజులకోసారి గడువు వరకు ఇవ్వాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. తెలంగాణ వచ్చాక ఉమ్మడి జిల్లాలో వ్యవసాయం పండుగలా సాగుతున్నదని చెప్పారు.
సీఎం కేసీఆర్ చొ రవతో ప్రాజెక్టుల వద్దే బస చేసి పనులు పూర్తి చేయించామని గుర్తు చేశారు. దాదాపు 70 సార్లు జొన్నలబొగుడను సందర్శించినట్లు తెలిపారు. కేవలం 4.5 లక్షల ఎకరాలు మాత్రమే అనుకున్నా తర్వాత ఎంజీకేఎల్ఐ కింద 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదన్నా రు. తుమ్మిళ్ల పథకం కాల్వ పనులతోపాటు మూడు రిజర్వాయర్లను చేపట్టాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. ఆ యా నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న నీటిపారుదల పనులపై ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులతో సం క్రాంతి సమావేశాలు నిర్వహించాలన్నారు.
ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ రైతులు వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారని, ఇందుకు సీఎం కేసీఆరే కారణమని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, సీఈలు హమీద్ఖాన్, రఘునాథరావు, ఎస్ఈలు సత్యశీలారెడ్డి, శ్రీనివాస్రా వు, విజయభాస్కర్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, ధర్మతేజ, పార్థసారథి, అధికారులు ఉన్నారు.