గద్వాల, ఫిబ్రవరి 23 : విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా అవసరమని, క్రికెట్లో రాణించి జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలబెట్టాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సూచించారు. గద్వాలకు చెందిన అరుణ్కుమార్ హెచ్సీఏ జాతీయస్థాయి అండర్-23 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అరుణ్కుమార్ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్వాల క్రీడలకు పుట్టినిల్లని ఇప్పటికే కబడ్డీ, ఫుట్బాల్, కరాటే తదితర క్రీడల్లో జాతీయస్థాయిలో రాణిస్తూ జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకొవచ్చారని చెప్పారు. క్రీడాకారులకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, దౌలన్న, లక్ష్మన్న, నర్సింహులు, హన్మంత్రెడ్డి, రమేశ్, ధర్మనాయుడు తదితరులు పాల్గొన్నారు.
శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత అకాల మృతి పై ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్లో లాస్యనందిత పార్థివదేహంపై పూలమాల ఉంచి నివాళులర్పించారు. అ నంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ విజయ్కుమార్, జెడ్పీటీసీ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.