వడ్డేపల్లి : మున్సిపాలిటీ కేంద్రమైన శాంతినగర్లోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా సందర్భంగా శరన్నవరాత్రోత్సవాలకు అన్ని ఏర్పాటు చేశామని ఆర్యవైశ్యసంఘం అధ్యక్షులు రావూరి సురేష్ తెలిపారు. 7వ తేదీ నుంచి15వ తేదీ వరకు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరణ చేసి పూజలు నిర్వహిస్తామని అన్నారు. మొదటి రోజు బాలత్రిపుర సుందరిగా అలంకరణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు.
ప్రతి రోజు ఉదయం 8 గంటలకు అభిషేకం, పూజ, 11 గంటలకు సాయంత్రం 6 గంటలకు సామూహిక కుంకుమార్చన జరుగుతుందని ఆయన తెలిపారు. భక్తులు అందరూ ఈ శరన్నవరాత్రోత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆయల పూజారి వినయ్ కౌశిల్ శర్మ కోరారు.