మహబూబ్నగర్ : అక్రమంగా తరలిస్తున్న రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
ఎస్ఐ భగవంత్ రెడ్డి కథనం మేరకు.. జిల్లాలోని దేవరకద్ర మండలం గోప్లపూర్ స్టేజీ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.
అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ డీసీఎంను ఆపి సోదాలు చేపట్టాగా 25 కింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడ్డాయన్నారు. వీటిని అమరచింత నుంచి రాయచూర్కు తరలిసత్తుంగా పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని దేవరకద్ర ఎస్ఐ భగవంత్ రెడ్డి తెలిపారు.