మరికల్, మార్చి 29 : ఎలాంటి అనుమతులు లే కుండా తరలిస్తున్న రూ.8.40లక్షలను సీజ్ చేసినట్లు మరికల్ సీఐ రాజేందర్రెడ్డి తెలిపారు. సీఐ కథనం మేరకు.. బీరప్ప అనే వ్యక్తి దేవరకద్ర మండలం గురకొండ నుంచి మక్తల్ మండలం జక్లేర్కు బైక్పై రూ. 8.40లక్షలు తీసుకెళ్తున్నాడు. మండలంలోని లాల్కోట చౌరస్తా వద్ద పోలీసులు శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో నగదును పట్టుకున్నారు. సరైన పత్రాలను చూపకపోవడంతో డబ్బులను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. అనుమతులు లేకుండా రూ.50వేలకు మించి డబ్బులు తరలిస్తే సీజ్ చేస్తామని పేర్కొన్నా రు. సరైన ఆధారాలు లేకుండా నగదు తరలిస్తూ పట్టుబడి ఇబ్బందులు పడొద్దని ఆయన సూచించారు.
బుద్ధారం గండి వద్ద రూ.1.90లక్షలు..
గోపాల్పేట, మార్చి 29 : మండలంలోని బుద్ధారం గండి చెక్పోస్టు వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసు లు వాహనాల తనిఖీ నిర్వహించారు. బిజినేపల్లి మం డలం లింగసానిపల్లికి చెందిన సత్యనారాయణ కారు లో వనపర్తికి వెళ్తుండగా బుద్ధారం చెక్పోస్టు వద్ద ఎస్సై హరిప్రసాద్గౌడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతడి నుంచి రూ.లక్షా 90వేలు లభించగా సరైన ఆధారాలు చూపించలేదు. దీంతో నగదును సీజ్ చేశారు.
టోల్ప్లాజా వద్ద రూ.1.16లక్షలు..
మూసాపేట(అడ్డాకుల), మార్చి 29 : అనుమతి లే కుండా తరలిస్తున్న నగదును పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. అడ్డాకుల మండలం శాఖాపూర్ టోల్ప్లాజా వద్ద పోలీసులు వా హనాలను తనిఖీ చేస్తున్నారు. ఈక్రమంలో కర్ణాటక రాష్ట్రం హోస్పేటకు చెందిన ఆదిల్ నవాజ్ కర్నూల్ వైపు నుంచి హైదరాబాద్కు కారులో వెళ్తుండగా టోల్ప్లాజా వద్ద పోలీసులు తనిఖీ చేశారు. రూ.1.16 లక్షల నగదు లభించగా అందుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో నగదు సీజ్ చేసి ట్రెజరీకి పంపినట్లు తెలిపారు.