కల్వకుర్తి, మే 27 : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత మండలంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఇసుక పంచాయితీ తలెత్తింది. కొత్త, పాత వర్గాలుగా కాంగ్రెస్ శ్రేణు లు విడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి వ్య తిరేకంగా పనిచేసిన వారిని వద్దంటున్నా పార్టీలోకి ఆ హ్వానించడంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న పాత నాయకులకు ఇసుక పంచాయితీ పుండు మీద కారం చల్లినట్లయ్యింది. కాంగ్రెస్లో కొత్తగా చేరిన వారికి ఎమ్మెల్యే స హకరిస్తూ తమను పట్టించుకోవడం లేదని పాత నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. ఎమ్మెల్యేగా గెలిపిం చే వరకు ఓడ మల్లయ్యలమైన తాము ఇప్పుడు బోడమల్లయ్యలమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు.. సీఎం రేవంత్రెడ్డి సొంత మండలం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ మండలంపై ముఖ్యమంత్రి కుటుంబం ప్రత్యేక దృష్టి సారించింది. వంగూరుతోపాటు చారకొండ మండలా ల్లో వివిధ పార్టీల్లో కొనసాగుతున్న నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. స్థానికంగా ఉన్న అదే పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తు న్నా పట్టించుకోకుండా చేర్చుకోవడంతో అసమ్మతి మొ దలైంది.
కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత లభిస్తుండడంతో కొత్త, పాత కాంగ్రెస్ నాయకుల మధ్య స్పష్టమైన విభజన ఏర్పడింది. కష్టాలను భరిస్తూ, పార్టీ కోసం పనిచేస్తే.. అధికారం వచ్చాక తమను కూరలో క రివేపాకులా తీసేస్తున్నారని పాత నాయకులు ఆసహ నం వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి పొమ్మనలేక పొగబెట్టినట్లు తయారైందని వారు వాపోతున్నారు.
ఇసుక పంచాయితీ కొత్త, పాత కాంగ్రెస్ నాయకుల మధ్య స్పష్టమైన విభజనను తీసుకొచ్చింది. వంగూర్ మండల సరిహద్దుల గుండా దుందుభీ వాగు పారుతున్నది. సరిహద్దు గ్రామాల నాయకులకు ఇసుక ఆదాయ వనరు అన్న మాట కాదనలేని నిజం. అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీ నాయకులు ఇసుక విషయం లో ఆధిపత్యం చూపుతారన్నది జగమెరిగిన సత్యం.
ఇ న్నాళ్లు డీలా పడిన హస్తం నేతలు రాష్ట్రంలో తమ ప్ర భుత్వం అధికారంలోకి రాగానే హుషారయ్యారు. పార్టీ కోసం పనిచేసిన తాము మాత్రమే కష్టమైనా, సుఖమై నా అనుభవించాలని భావించారు. అధికారం చేపట్టగానే అప్పట్లో పార్టీని విమర్శించిన వారు హస్తం గూటికి రానివ్వొద్దని పాత కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేపై ఒ త్తిడి తీసుకొచ్చారు. అయినా తమ మాట చెల్లుబాటు కాకపోవడం, కొత్తగా పార్టీలో చేరిన వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తుండడంతో పాత నేతలు ఆందోళనకు గురవుతున్నారు.
వంగూరు మండలం దుందుభీ సరిహద్దు గ్రామాల లో చాలామందికి ట్రాక్టర్లున్నాయి. వారు తమ వాహనాల్లో ఇసుకను సరఫరా చేస్తుంటారు. అధికార పార్టీ అండదండలున్నవారు ఇందులో ముందుండడంతో అ సలు సమస్య ఇక్కడే వచ్చి పడింది. మండలంలోని మి ట్టసదగోడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ వీరాభిమాని ఒకాయన తన ట్రాక్టర్లో ఇసుక నింపుకొని కల్వకుర్తికి వచ్చాడు. అనుమతులు లేకుండా ఇసుకను సరఫరా చే స్తున్నాడని కల్వకుర్తి పోలీసులు కేసు నమోదు చేసి ట్రాక్టర్ను పీఎస్కు తరలించారు. విషయం తెలుసుకొని మి ట్టసదగోడుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత(పాతకాంగ్రెస్) తన అనుచరులతో కలిసి పోలీస్స్టేషన్కు వచ్చి ఎస్సైని ఆరా తీశాడు.
కేసు నమోదు చేశామని చెప్పడం తో సదరు నేత ఇదే విషయాన్ని ఎమ్మెల్యేకు వివరించా డు. ఆరోజు జెడ్పీ సమావేశంలో ఉన్న ఎమ్మెల్యే నేరుగా వంగూరు జెడ్పీటీసీతో కలిసి కల్వకుర్తి పీఎస్కు రాగా ట్రాక్టర్పై కేసు నమోదు చేశామని.. కోర్టులో జరిమానా కడితే ట్రాక్టర్ విడిచిపెడతామని పోలీసులు చెప్పడంతో కాంగ్రెస్ నాయకులు అసహనానికి లోనయ్యారు. కష్టనష్టాలకోర్చి పనిచేసిన తమ ట్రాక్టర్లను పోలీసులు పట్టుకోవడమేంటని ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. నిన్న, మొన్న పార్టీలో చేరిన వారు ఇసుక దందాతో లక్షలు సం పాదిస్తున్నారు.. వారి వాహనాలను ఎవరూ పట్టుకోరు..
మా ట్రాక్టర్లను మాత్రం పట్టుకుంటారా అంటూ ప్రశ్నించారు. మాటామాట పెరిగి పార్టీలో ఉంటే ఉండండి లే కుంటే వెళ్లిపోండని ఎమ్మెల్యే అనడంతో గొడవ మరింత ముదిరింది. దీంతో పోలీసులు కలుగజేసుకోగా ఎమ్మె ల్యే కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొత్తగా పార్టీ లో చేరిన వారు ఇసుక దందా చేస్తే ఏమనరు.. తమలాంటి గ్రామస్థాయి నాయకులు ట్రాక్టర్లలో ఇసుక సరఫరా చేస్తే పట్టుకుంటారా? పార్టీకి ఇన్నాళ్లు సేవ చేసిన తాము బతకొద్దా? అని అరుస్తూ పీఎస్నుంచి బయటకొచ్చారు. ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి ఉందని.. మళ్లీ ఎన్నికలు రావా? అప్పుడు ఏం చేయాలో అది చేసి చూ పిస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.