“కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన రైతు రాజయ్య (పేరుమార్చాం)కు ఐదెకరాల వ్యవసాయ పొలం ఉన్నది. యాసంగిలో వరి నాటేందుకు రెండున్నర ఎకరాలు సిద్ధం చేసుకున్నాడు. వరి నాటే సమయం ఆసన్నమైంది. నాటు వేసే కూలీలకు, ఎరువుల బస్తాలకు డబ్బులు అవసరమవుతున్నాయి. రైతుబంధు డబ్బులు ఖాతాలో జమకాలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఒకరిద్దరు స్నేహితులను అడిగి చూశాడు. ఫలితంలేదు. ఇంటికి వచ్చి ఏం చేయాలి దేవుడా అంటూ దీనంగా కూర్చున్నాడు. రాజయ్య బాధను గమనించిన అతని భార్య మెడలో పసుపు కొమ్ము కట్టుకుని బంగారు పుస్తెలతాడు భర్త చేతిలో పెట్టింది. ఆమె వంక బాధతో చూసిన రాజయ్య పంట చేతికి రాగానే విడిపించి ఇస్తానని సర్దిచెప్పాడు. తర్వాత గుండెను బండ చేసుకొని వ్యాపారి వద్ద కుదువ పెట్టేందుకు కల్వకుర్తికి వెళ్లాడు. రైతుబంధు సాయం ఆలస్యమవుతుండటంతో ఇది కేవలం రాజయ్యకు వచ్చిన కష్టం కాదు. దాదాపు రైతులందరిదీ ఇదే పరిస్థితి.”
కల్వకుర్తి, ఫిబ్రవరి 12 : కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి అమలు కాని హామీలని అర్థమవుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన వెంటనే రైతులకు పెట్టుబడి సాయంగా రైతుభరోసా పథకం ద్వారా ఎకరానికి రూ.15 వేల చొప్పున వారి ఖాతాల్లో జమచేస్తామని రేవంత్రెడ్డి ప్రకటనలు నోటి మాటలుగానే మిగిలిపోయాయి. ఇక చేసేది లేక కేసీఆర్ ప్రభుత్వం అందించిన విధంగానే ఎకరాకు రూ.5 వేల చొప్పున 2023లోని డిసెంబర్ 12 నుంచి రైతుబంధు సాయాన్ని సర్కారు వేస్తున్నది. ఇది కూడా అరకొరే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండునెలలు కా వస్తున్నా.. ఇంకా మూడెకరాల వరకు మాత్రమే సా యం అందింది. ఇది ఇలాగే సాగితే ఏడాది పొడవునా రైతుబంధు కోసం కర్షకులు ఎదురు చూడాల్సిందే.
నాగర్కర్నూల్ జిల్లాలో మొత్తం 3,22,724 మం ది రైతులు ఉన్నారు. వీరి ఆధీనంలో 7,59,793 ఎకరాల వ్యవసాయ పొలం ఉన్నది. వీరికి ఎకరాకు రూ.5 వేల చొప్పున ఇస్తే రూ.379.90 కోట్లు అవసరమవుతాయి. ఎకరంలోపు రైతులు 1,02,912, రెండెకరాలు ఉన్న రైతులు 81,060 మంది, మూడెకరాలు ఉన్న రైతులు 53,617 మంది, నాలుగెకరాలు ఉన్న రైతులు 34,824 మంది, ఐదెకరాలు ఉన్న రైతులు 25,600 మంది, పదెకరాలు ఉన్న రైతులు 20,594, పదికిపైగా భూములున్న రైతులు 4,117 మంది ఉ న్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పెట్టుబడి సా యాన్ని వారి ఖాతాల్లో వారం, పదిరోజుల్లోనే జమచేసేది. ఎకరం నుంచి మొదలు పెట్టి 10 రోజుల్లో రైతులందరికీ సాయం అందించేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం వేసే సాయాన్ని చూసి రైతులు అవాక్కవుతున్నారు. సాయం ఎప్పుడందుతుంది.. యాసంగి సాగు ఎప్పడు ప్రారంభించాలని ఆందోళన చెందుతున్నారు.
రైతుబంధు సాయం ఎప్పుడిస్తారని రోజూ ఎదురుచూస్తున్నాం. చూసి చూసి కండ్లు కాయలు కాస్తున్నాయే తప్పా సాయం మాత్రం అందడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం పెట్టుబడి సాయం వేస్తున్నామని చెప్పిన వెంటనే బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవి. నాకు నాలుగు ఎకరాల 30 గుంటల పొలం ఉన్నది. ఈసారి పత్తి, వరి, వేరుశనగ సాగు చేశాను. రెండెకరాల్లో వేసిన వేరుశనగ తీయడానికి కూలీలకు డబ్బులు కావాలి.. రైతుబంధు సాయం వస్తే వారికి, లేదా ఇతర ఖర్చులకు ఉపయోగపడేవి. రెండు నెలలాయే.. డబ్బులు పడటం లేదు. ఇక చేసేది లేదు.. ఎవరినైనా మిత్తికి డబ్బులు అడగాలి. రైతుబంధు పైసలు వేయడానికి దిక్కూ దివాణా లేదు.. ఇక రుణమాఫీ అంతా బూటకమే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నమ్మితే నట్టేట మునుగుడు ఖాయం.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు గడిచింది. రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం పెంచి ఇస్తామని సీఎం చెప్పారు. రెండు నెలలైనా నేటికీ పాతది లేదు.. కొత్తది లేదు.. రెండు నెలల నుంచి అదిగో ఇప్పుడు.. ఇ దిగో అప్పుడు.. అంటున్నారే తప్పా.. ఖాతాలలో పడిం ది లేదు. యాసంగిలో పంటల సాగు కోసం మళ్లీ షావుకార్ల వద్దకు వెళ్లాలి. నమ్మించి నట్టేట ముంచినట్లు ఉన్న ది కాంగ్రెస్ పాలన. సాయం ఇస్తారన్న నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతున్నది. నాకు మూడెకరాల పొలం ఉన్న ది. ఇప్పటి వరకు పైసలు జమ కాలేదు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రైతుబంధు ఇస్తమని చెప్పిన వెంటనే వారం రోజుల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేసేది. రైతుల మొబైల్ ఫోన్లకు టింగ్ టింగ్ మంటూ మెసేజ్లు వచ్చేవి.
యాసంగికి పాత పద్ధతిలోనే రైతుబంధు సా యం అందిస్తామని, వచ్చే వానకాలం రైతుభరోసా పేరుతో ఎకరాకు రూ.15 వేలు చెల్లిస్తామ ని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా గత డిసెంబర్ నుంచి కేసీఆర్ ప్రభుత్వం అందించిన విధంగానే డబ్బులు జమ చేస్తూ వస్తున్నది. అయి తే ఈ సాయం అందజేత నత్తనడకను తలపిస్తున్న ది. రెండు నెలలు కావస్తున్నా కేవలం మూడెకరా లు ఉన్న రైతులకే సాయం అందింది. ఇక మొత్తానికి ఇవ్వడానికి ఎన్ని నెలల సమయం పడుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంట పెట్టుబడి కో సం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నామని, మళ్లీ మా పరిస్థితి మొదటికొచ్చిందని పలువురు వాపోతున్నారు. ఇలా అయితే పంటలెలా పండించుకోవాలి.. ఇక మా పరిస్థితి ఏంగావాలో అని వాపోతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం వానకాలం, యాసంగి సాగు కు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.10 వేలు రై తుల ఖాతాల్లో జమ చేసేది. అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇ చ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక పాత పద్ధతిలోనే రైతుబంధు అందిస్తామని సీఎం రేవంత్ చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సా యాన్ని కూడా నత్తను పోలినట్లు వేస్తుండడంపై ఆం దోళన చెందుతున్నారు. నమ్మితే నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయం గురించి అడిగితే కాంగ్రెస్ మంత్రి ఒకరు చెప్పుతో కొట్టాలని మా ట్లాడడంపై మండిపడుతున్నారు. ఎవ రు ఎవర్ని చెప్పుతో కొడతారో కాలమే సమాధానం చెబుతుందని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల వ రకే.. చేతల ప్రభుత్వం కాదని రైతు సం ఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు డబ్బులు వేయకపోవడంతో రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేసే పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ ప్రభుత్వంలో అదునుకు రైతుబంధు ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు పడేవి. రేవంత్రెడ్డి రైతుబంధును రూ.10వేల నుంచి రూ.15వేలు ఇస్తానని చెప్పి, పంటల సీజన్ అయిపోయి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు పంటపెట్టుబడి వేయడం లేదు. నాకు 4 ఎకరాల 22 గుంటల పొలం ఉంది. సాగు చేయడానికి డబ్బుల్లేక రూ.3 వడ్డీ తెచ్చి వరినారు వేశా. రూ.లక్షా పదివేలు పెట్టుబడి అయ్యింది. ఈ ప్రభుత్వం రైతుబంధు వేస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా సాయం అందించలేదు.
ఇప్పటి వరకు రైతు బంధు రాలేదు. వస్తదనే న మ్మకం కూడా లేదు. కేసీఆర్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం క్రమం తప్పకుండా రైతుబంధు ఇచ్చింది. పంట పెట్టుబడికి చాలా అక్కరకు వచ్చేది. గిప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు రైతుబంధు ఇస్తలేదు.. అప్పులు చేయాల్సిందే.. మిత్తి కట్టాల్సిందే. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు మారుతాయనే నమ్మకం లేదు. నాకు 3 ఎకరాల 38 గుంటల వ్యవ సాయ పొలం ఉంది. రైతుబంధును పెంచి ఇస్తమ న్నారు.. ఇప్పుడేమో అసలుకే మోసం వచ్చింది.